IND vs PAK: భారత్- పాకిస్థాన్ మధ్య బ్లాక్ బస్టర్ పోరు.. ఐదు కీ పాయింట్స్!
- నేడు భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్..
- ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారోననే కొనసాగుతున్న ఉత్కంఠ..
- భారత్- పాకిస్థాన్ కు సంబంధించి కీలకమైన ఐదు పాయింట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ రెండు జట్ల మధ్య 16 నెలల తర్వాత జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే, ఈ చిరకాల ప్రత్యర్థులు ఢీకొనే హై-వోల్టేజ్ పోరును మరింత ఉత్తేజపరిచేలా ఐదు అంశాలు..
Read Also: SLBC Tunnel: క్షణక్షణం ఉత్కంఠ.. సన్నగిల్లుతున్న ఆశలు!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
1. ఇద్దరు సూపర్ స్టార్ల యుద్ధం..
చాలా సంవత్సరాలుగా దాయాదా దేశాల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే, బ్యాటింగ్ విభాగంలో భారత పటిష్టంగా ఉంటే.. బౌలింగ్ లో పాకిస్తాన్ బలంగా ఉంది.. ఇక, 2021 నుంచి ఈ మ్యాచ్ ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ- బాబర్ ఆజం ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేటి మ్యాచ్ కు ముందు ఇద్దరు సూపర్ స్టార్లు ఫామ్లో లేరు.. కోహ్లీ తన గత ఆరు ఇన్నింగ్స్లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగా.. బాబర్ ఆజమ్ సైతం తన పేలవమైన స్ట్రైక్ రేట్ కారణంగా విమర్శలకు గురవుతున్నాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు ఒత్తిడిని జయించి తన జట్టును విజయంలో కీలక పాత్ర పోషిస్తారనేది వేచి చూడాలి.
2. స్పిన్ తో తికమక..
టీమిండియా తన 15 మంది సభ్యుల జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయగా, పాకిస్తాన్ జట్టులో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. దుబాయ్లో జరిగిన మొదటి మ్యాచ్లో స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం మనం చూడొచ్చు. నేడు జరిగే మ్యాచ్లో కూడా స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. ఇక, ఈరోజు పాక్ తో జరిగే మ్యాచ్ లో తుది జట్టులో వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కొచ్చు. ఇక, టీమిండియాకు షాక్ ఇచ్చేందుకు పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్, నసీమ్ షాలతో కూడిన పేస్ దళాంతో దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది. దీంతో స్పిన్ vs పేస్ యుద్ధంలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి..
Read Also: Mahesh Babu: SSMB29 మూవీ పై రాజమౌళి ప్రెస్ మీట్..?
3. భారతదేశం ఆధిపత్యం
73 ఏళ్ల ఈ పోటీలో భారత్- పాకిస్థాన్ జట్లు వేర్వేరు దశల్లో ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించాయి. తొలి 24 సంవత్సరాలు (1978-2002 వన్డేల్లో) పాకిస్తాన్ 85 వన్డే మ్యాచ్లలో 52 గెలిచి, బలమైన జట్టుగా నిలిచింది.. అయితే, అనంతరం 2002 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత 23 ఏళ్లలో మెన్ ఇన్ బ్లూ జట్టు చిరకాల ప్రత్యర్థులకు ఎదురుదెబ్బ కొట్టడంలో విజయవంతమైంది. ఎందుకంటే టీమిండియా 2003 నుంచి 50 మ్యాచ్లలో 28 విజయాలతో పాక్ పై ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే, 2010 నుంచి ఈ పోరు ఏకపక్షంగా మారిపోయింది. భారతదేశం 17 మ్యాచ్లలో 12 సార్లు పాకిస్తాన్ను ఓడించింది. ఇక, నేడు జరగబోయే మ్యాచ్ లో మరోసారి టీమిండియా- పాకిస్థాన్ మధ్య పోరు ఉండబోతుంది అనేది చూడాలి.
4. పాకిస్తాన్ను ఎప్పుడూ లెక్క చేయకండి
క్రీడా చరిత్రలో అత్యంత చురుకైన జట్లలో ఒకటిగా పాకిస్తాన్ ఖ్యాతిని కలిగి ఉంది. ప్రత్యర్థి జట్లను ఆశ్చర్యపరిచేందుకు ఎన్ని అడ్డంకులను అయినా మెన్ ఇన్ గ్రీన్ టీమ్ అధిగమించగలదు. అలాగే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో వారు ఎదుర్కొన్న అదే క్లిష్ట పరిస్థితిలో.. లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ఫైనల్ లో మాత్రం మెన్ ఇన్ బ్లూను ఓడించి తమ తొలి టైటిల్ను గెలుచుకున్నారు. ఈరోజు జరిగే డూ-ఆర్-డై మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ బృందం కూడా ఇలాంటిదే చేయాల్సి ఉంటుంది.
Read Also: Sridhar Babu: ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
5. దుబాయ్లో అనూహ్య పరిస్థితులు
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ రెండవ మ్యాచ్ భిన్నమైన పిచ్పై ఆడనుంది భారత్. ఇది రెండు జట్ల ఆసక్తిని పెంచుతుంది. మొదటి మ్యాచ్లో స్పిన్నర్లు దానిపై బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదించినట్లు కనిపించినప్పటికీ.. ఈరోజు ఆడే పిచ్ అలాగే ఉంటుందో లేదో చూడాలి.. అంతేకాకుండా, మంచు కురిస్తే.. బ్యాటర్లకు అనుకూలంగా మారుస్తుండటంతో.. రెండవ ఇన్నింగ్స్లో దుబాయ్ బౌలర్లకు కష్టంగా మారనుంది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్కు మంచు కురవకపోయినప్పటికీ.. ఈ మ్యాచ్ లో కూడా మంచు కురవదని పూర్తి నమ్మకంతో చెప్పలేము అని క్యూరేటర్లు తెలిపారు. ఇక, టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్లు తీసుకునే నిర్ణయంపై ఆలోచించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!