SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్రైజర్స్ ఘోర పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Won By 7 Runs On Sunrisers Hyderabad: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ జట్టు నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సన్రైజర్స్లోని స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడం.. లక్ష్యం చిన్నదే కావడంతో మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఆడటంతో.. ఎస్ఆర్హెచ్ ఈ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
Neha Sharma: ఎద అందాలు దాచినా దాగనట్టున్నాయే..
Also Read
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (34), అక్షర్ పటేల్ (34) ఆశాజనకమైన ఇన్నింగ్స్తో నెట్టుకురావడం.. అంతకుముందు డేవిడ్ వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25) పర్వాలేదనిపించడంతో.. ఢిల్లీ జట్టు ఆ స్థాయి స్కోరు చేయగలిగింది. ఇక 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు.. ఆది నుంచే నిదానంగా ఆడుతూ వచ్చింది. వీలు చిక్కినప్పుడల్లా మయాంక్ అగర్వాల్ ఫోర్లు కొట్టాడు కానీ, బ్రూక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చాడు. అతడు 14 బంతుల్లో 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి ఏమైనా మ్యాజిక్ చేశాడా అంటే.. అతడు కూడా నిరాశపరిచాడు. 21 బంతులాడిన అతగాడు కేవలం 15 పరుగులే చేశాడు. కెప్టెన్ మార్ర్కమ్ కూడా 3 పరుగులకే జెండా ఎత్తేశాడు. టాపార్డర్లో ఎవరైనా బాగా రాణించారంటే.. అది మయాంక్ అగర్వాల్ (49) ఒక్కడే. పాపం.. అతడు ఒక్క పరుగు తేడాతో అర్థశతకం కోల్పోయాడు.
Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై
టాపార్డర్ ఘోరంగా విఫలం అవ్వడంతో.. చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 5 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు క్రీజులో ఉన్న క్లాసెన్, సుందర్.. కాసేపు మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా క్లాసెన్ అయితే దుమ్ముదులిపేశాడు. అతడు ఆడిన ఆటతీరు చూసి.. సన్రైజర్స్ విజయం తథ్యమని అంతా భావించారు. కానీ.. 31 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. భారీ షాట్లు బాదే అవకాశమే ఇవ్వలేదు. కేవలం ఐదంటే ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయఢంకా మోగించింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్యే, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్లు చెరో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!