Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
- ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు టోర్నీ
- టీ20 ఫార్మాట్లో జరగనున్న మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026 Cricket Schedule: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జపాన్లోని ఐచి-నగోయా నగరాల్లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ టోర్నీలో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకుంది. పురుషుల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి ఆరంభం కానుంది. అన్ని మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లకు పూర్తి అంతర్జాతీయ హోదా కూడా ఉండనుంది.
2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. టైటిల్ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు టాప్ సీడెడ్ టీమ్లుగా నేరుగా క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-ఏలో ఆఫ్ఘానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బీలో హాంకాంగ్, మలేషియా, ఒమన్ జట్లు మిగిలిన నాలుగు క్వార్టర్ఫైనల్ బెర్త్ల కోసం పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంటాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
- Shreyas Iyer: 7 మ్యాచ్ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్కు విముక్తి!
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రం ఒక్కటే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్స్లోకి ప్రవేశించడంతో.. లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. ఇరు జట్లు గెలుస్తూ ముందుకు వస్తే మాత్రమే సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్-పాకిస్థాన్ పోరు జరిగే అవకాశముంది. మహిళల విభాగంలో భారత జట్టు క్వార్టర్ఫైనల్లో జపాన్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లేదా చైనా జట్లలో ఒకదానితో పోటీ పడుతుంది. మరోవైపు శ్రీలంక-మలేషియా, పాకిస్థాన్-థాయ్లాండ్ మధ్య క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ మ్యాచ్ల విజేతలు రెండో సెమీఫైనల్లో తలపడతారు.
ఈ టోర్నీలో మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగుతుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇటీవల జింబాబ్వేపై మెరుపు ప్రదర్శనతో ప్రపంచ రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా భారత 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసియా క్రీడల వేదికగా మరోసారి స్వర్ణ పతకాన్ని అందుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!