Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
- ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు టోర్నీ
- టీ20 ఫార్మాట్లో జరగనున్న మ్యాచ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026 Cricket Schedule: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జపాన్లోని ఐచి-నగోయా నగరాల్లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ టోర్నీలో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకుంది. పురుషుల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి ఆరంభం కానుంది. అన్ని మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లకు పూర్తి అంతర్జాతీయ హోదా కూడా ఉండనుంది.
2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. టైటిల్ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు టాప్ సీడెడ్ టీమ్లుగా నేరుగా క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-ఏలో ఆఫ్ఘానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బీలో హాంకాంగ్, మలేషియా, ఒమన్ జట్లు మిగిలిన నాలుగు క్వార్టర్ఫైనల్ బెర్త్ల కోసం పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంటాయి.
Also Read
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రం ఒక్కటే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్స్లోకి ప్రవేశించడంతో.. లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. ఇరు జట్లు గెలుస్తూ ముందుకు వస్తే మాత్రమే సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్-పాకిస్థాన్ పోరు జరిగే అవకాశముంది. మహిళల విభాగంలో భారత జట్టు క్వార్టర్ఫైనల్లో జపాన్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లేదా చైనా జట్లలో ఒకదానితో పోటీ పడుతుంది. మరోవైపు శ్రీలంక-మలేషియా, పాకిస్థాన్-థాయ్లాండ్ మధ్య క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ మ్యాచ్ల విజేతలు రెండో సెమీఫైనల్లో తలపడతారు.
ఈ టోర్నీలో మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగుతుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇటీవల జింబాబ్వేపై మెరుపు ప్రదర్శనతో ప్రపంచ రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా భారత 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసియా క్రీడల వేదికగా మరోసారి స్వర్ణ పతకాన్ని అందుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!