Team India: ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. గందరగోళంలో ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్లు పనిచేయాల్సి వచ్చింది.
గత ఏడాది జూన్లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ టూర్కు వెళితే.. శ్రీలంకలో శిఖర్ ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పర్యటించింది. శ్రీలంక పర్యటనలో కెప్టెన్గా వన్డే సిరీస్ను 2-1 తేడాతో అందించిన శిఖర్ ధావన్.. కరోనా దెబ్బతీయడంతో టీ20 సిరీస్ను మాత్రం 1-2తో ప్రత్యర్థికి అప్పగించాడు.
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
అటు దక్షిణాఫ్రికా పర్యటనలో రెండో టెస్ట్కు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అనంతరం వన్డే సిరీస్కు కూడా సారథిగా వ్యవహరించాడు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ను 1-2 తేడాతో కోల్పోగా… రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్లో వైట్ వాష్ అయ్యింది. సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్లు ఆడగా రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ రెండు జట్లను క్లీన్ స్వీప్ చేసి వరుసగా 15 మ్యాచుల్లో రోహిత్ విజయాలు అందుకున్నాడు. తాజాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత తాత్కాలిక కెప్టెన్గా ఎంపికైన కేఎల్ రాహుల్ గాయపడటంతో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్కు రిషబ్ పంత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. త్వరలో ఐర్లాండ్లో పర్యటించనున్న భారత జట్టుకు హార్డిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. దీంతో ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యే పరిస్థితులు జట్టులో నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!