IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి, 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్స్ లేకపోయినా, ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని అన్నాడు. ఈ జట్టు వెనుక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని, అతను ఉన్నంతవరకూ స్వేదశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని తెలిపాడు. ‘‘మూడో టీ20లో విజయం సాధించి, భారత్ సిరీస్పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. స్వదేశంలో టీమిండియా అంత సులువుగా ఓడిపోదు. కాబట్టి.. ఇప్పుడు ఒత్తిడి ఉన్నది భారత్పై కాదు, దక్షిణాఫ్రికాపై! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోయినా.. పోరాట పటిమ ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లని అభినందించాల్సిందే! హర్షల్ పటేల్, చాహల్ బాగా బౌలింగ్ చేయడంతో.. మూడో మ్యాచ్ని కైవసం చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది’’ అని ఇంజమామ్ అన్నాడు.
Also Read
- Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? 'అతడిని బయటకు పంపండి' అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
- Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
- Ashwin: "అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు".. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Abhishek Sharma: "గర్ల్ఫ్రెండ్" అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
అంతేకాదు.. తొలుత ఈ సిరీస్ని దక్షిణాఫ్రికా కౌవసం చేసుకుంటుందని అనిపించిందని, దాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపాడు. ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని, అది చూడ్డానికి కనులవిందుగా ఉందన్నాడు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడని, యంగ్స్టర్స్తో ఎలా ఉండాలో అతనికి తెలుసని, అండర్-19 ఫార్ములానే ఇక్కడా అమలు చేస్తున్నాడని ఇంజమామ్ వివరించాడు.
తాజావార్తలు
-
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
-
CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!