IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి, 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్స్ లేకపోయినా, ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని అన్నాడు. ఈ జట్టు వెనుక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని, అతను ఉన్నంతవరకూ స్వేదశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని తెలిపాడు. ‘‘మూడో టీ20లో విజయం సాధించి, భారత్ సిరీస్పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. స్వదేశంలో టీమిండియా అంత సులువుగా ఓడిపోదు. కాబట్టి.. ఇప్పుడు ఒత్తిడి ఉన్నది భారత్పై కాదు, దక్షిణాఫ్రికాపై! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోయినా.. పోరాట పటిమ ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లని అభినందించాల్సిందే! హర్షల్ పటేల్, చాహల్ బాగా బౌలింగ్ చేయడంతో.. మూడో మ్యాచ్ని కైవసం చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది’’ అని ఇంజమామ్ అన్నాడు.
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
అంతేకాదు.. తొలుత ఈ సిరీస్ని దక్షిణాఫ్రికా కౌవసం చేసుకుంటుందని అనిపించిందని, దాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపాడు. ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని, అది చూడ్డానికి కనులవిందుగా ఉందన్నాడు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడని, యంగ్స్టర్స్తో ఎలా ఉండాలో అతనికి తెలుసని, అండర్-19 ఫార్ములానే ఇక్కడా అమలు చేస్తున్నాడని ఇంజమామ్ వివరించాడు.
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!