IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి, 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్స్ లేకపోయినా, ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని అన్నాడు. ఈ జట్టు వెనుక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని, అతను ఉన్నంతవరకూ స్వేదశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని తెలిపాడు. ‘‘మూడో టీ20లో విజయం సాధించి, భారత్ సిరీస్పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. స్వదేశంలో టీమిండియా అంత సులువుగా ఓడిపోదు. కాబట్టి.. ఇప్పుడు ఒత్తిడి ఉన్నది భారత్పై కాదు, దక్షిణాఫ్రికాపై! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోయినా.. పోరాట పటిమ ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లని అభినందించాల్సిందే! హర్షల్ పటేల్, చాహల్ బాగా బౌలింగ్ చేయడంతో.. మూడో మ్యాచ్ని కైవసం చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది’’ అని ఇంజమామ్ అన్నాడు.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
అంతేకాదు.. తొలుత ఈ సిరీస్ని దక్షిణాఫ్రికా కౌవసం చేసుకుంటుందని అనిపించిందని, దాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపాడు. ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని, అది చూడ్డానికి కనులవిందుగా ఉందన్నాడు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడని, యంగ్స్టర్స్తో ఎలా ఉండాలో అతనికి తెలుసని, అండర్-19 ఫార్ములానే ఇక్కడా అమలు చేస్తున్నాడని ఇంజమామ్ వివరించాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!