BJP : తెలంగాణ బీజేపీలో ఆ పరిస్థితి ఎందుకొచ్చింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముగ్గురు గతంలో నియమితులు కాగా.. రీసెంట్ గా మరో ఆరుగురునీ నియమించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార ప్రతినిధుల ప్రధాన బాధ్యత.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పై, సంఘటనల పై స్పందించడం… వివిధ అంశాల పై పార్టీ వైఖరి ఏంటో చెప్పడం. దీంతో పాటు సీనియర్ నేతల మీడియా సమావేశాలు ఉంటే.. ముందే మెటీరియల్ సమకుర్చడం.. బ్యాక్ ఆఫీసు సపోర్ట్ గా ఉండటం. అయితే అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది తాము చేయాల్సిన పని చేయడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. గతంలో అధికార ప్రతినిధులు రెగ్యులర్ గా సమావేశం అయ్యేవారు. వివిధ అంశాల పై ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకునే వారు. కరెంట్ ఇష్యూ స్ పై పార్టీ లైన్ ఏంటనే దాని అందరికీ క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అలా సమావేశాలు రెగ్యులర్ గా జరగడం లేదు. ఒక వేళ సమావేశాలు అప్పుడప్పుడూ జరిగినా.. అందరూ అటెండ్ కావడం లేదు.
పార్టీ అధికార ప్రతినిధుల తీరు పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జరుగుతున్న డెవెలప్ మెంట్స్ పై వెంటనే స్పందించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారట. ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇకపై జరుగుతున్న సంఘటనలపై వెంటనే స్పందించాలని, అలెర్ట్ గా ఉండాలని సూచించారట. సమాచార సేకరణలో అధికార ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండొద్దని అన్నారట. TRS పార్టీ నేతలు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే వెంటనే కౌంటర్ ఇవ్వడం లేదని క్లాస్ తీసుకున్నారట. 9 మంది అధికార ప్రతినిధులున్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని.. రోజూ ఒకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారట. జిల్లాల్లో జరిగే ఘటనలపై స్థానిక నేతలను అప్రమత్తం చేయడం వెంటనే వారికి పార్టీ లైన్ ఏంటో చెప్పాలని సూచించారట.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
బండి సంజయ్ ఆదేశాలు అటుంచితే.. అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది పార్టీకి కొత్త. చొరవ తీసుకోవడం లో కొద్దిగా వెనుకా,ముందు ఆడుతున్నారట. ఇప్పుడు బండి సంజయ్ వారికి దిశానిర్దేశం చేయడంతో.. ఇక ముందు వాళ్లు ఎలా యాక్టివ్ అవుతారో చూడాలి.
- Tags
- bandi sajay
- bjp
- kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!