BJP : తెలంగాణ బీజేపీలో ఆ పరిస్థితి ఎందుకొచ్చింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముగ్గురు గతంలో నియమితులు కాగా.. రీసెంట్ గా మరో ఆరుగురునీ నియమించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార ప్రతినిధుల ప్రధాన బాధ్యత.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పై, సంఘటనల పై స్పందించడం… వివిధ అంశాల పై పార్టీ వైఖరి ఏంటో చెప్పడం. దీంతో పాటు సీనియర్ నేతల మీడియా సమావేశాలు ఉంటే.. ముందే మెటీరియల్ సమకుర్చడం.. బ్యాక్ ఆఫీసు సపోర్ట్ గా ఉండటం. అయితే అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది తాము చేయాల్సిన పని చేయడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. గతంలో అధికార ప్రతినిధులు రెగ్యులర్ గా సమావేశం అయ్యేవారు. వివిధ అంశాల పై ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకునే వారు. కరెంట్ ఇష్యూ స్ పై పార్టీ లైన్ ఏంటనే దాని అందరికీ క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అలా సమావేశాలు రెగ్యులర్ గా జరగడం లేదు. ఒక వేళ సమావేశాలు అప్పుడప్పుడూ జరిగినా.. అందరూ అటెండ్ కావడం లేదు.
పార్టీ అధికార ప్రతినిధుల తీరు పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జరుగుతున్న డెవెలప్ మెంట్స్ పై వెంటనే స్పందించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారట. ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇకపై జరుగుతున్న సంఘటనలపై వెంటనే స్పందించాలని, అలెర్ట్ గా ఉండాలని సూచించారట. సమాచార సేకరణలో అధికార ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండొద్దని అన్నారట. TRS పార్టీ నేతలు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే వెంటనే కౌంటర్ ఇవ్వడం లేదని క్లాస్ తీసుకున్నారట. 9 మంది అధికార ప్రతినిధులున్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని.. రోజూ ఒకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారట. జిల్లాల్లో జరిగే ఘటనలపై స్థానిక నేతలను అప్రమత్తం చేయడం వెంటనే వారికి పార్టీ లైన్ ఏంటో చెప్పాలని సూచించారట.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
బండి సంజయ్ ఆదేశాలు అటుంచితే.. అధికార ప్రతినిధులలో ఎక్కువ మంది పార్టీకి కొత్త. చొరవ తీసుకోవడం లో కొద్దిగా వెనుకా,ముందు ఆడుతున్నారట. ఇప్పుడు బండి సంజయ్ వారికి దిశానిర్దేశం చేయడంతో.. ఇక ముందు వాళ్లు ఎలా యాక్టివ్ అవుతారో చూడాలి.
- Tags
- bandi sajay
- bjp
- kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!