Modi : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కలవడం వెనుక మోడీ ప్లాన్ ఏంటి..?
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం రావడంతో వాయిదా పడింది. మోడీని కలవాలనుకున్న కార్పొరేటర్లు, వర్షం రావడంతో తీవ్ర నిరాశ చెందారు.
అయితే, కార్పొరేటర్లు నిరుత్సాహపడ్డారని భావించిన రాష్ట్ర బీజేపీ నాయకులు, కలిసే అవకాశం ఇవ్వాలని ప్రధాని కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రధాని వారికి టైమ్ ఇచ్చారు. గ్రేటర్ కార్పొరేటర్లు,ghmc పరిధిలో ఉండే రాష్ట్ర పదాధికారులు, ఆపై స్థాయి నేతలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలుస్తున్నారు.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో మోడీ హైదరాబాద్ కి వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి 15 రోజులు కూడా కావడం లేదు. అలాంటిది వీరికి సమయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో చాలా మునిసిపల్ కార్పొరేషన్ లు బిజెపి చేతిలో ఉన్నాయి. వాళ్లకు ఇవ్వని సమయాన్ని తెలంగాణ కు ఇచ్చారని, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు.
మోడీ ఏది చేసినా దాని వెనుక ఓ లెక్క ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. బలమైన సంకేతాలు ఇవ్వడం కోసమే, మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తెలంగాణపై తానే స్వయంగా రంగంలోకి దిగాను అనే సిగ్నల్ ఇవ్వడం కోసమే, చోటామోటా నేతలకు సైతం మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. దీంతో కార్పొరేటర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పార్టీ కార్యకర్తల్లో జోష్ వస్తుందని చెబుతున్నారు. రాజకీయంగా చర్చ జరుగుతుందని, కార్పొరేటర్ లకు మోడీ టైమ్ ఇవ్వడంపై ప్రజల్లో కూడా డిస్కషన్ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, బీజేపీ కార్పొరేటర్ లు కూడా పార్టీ జంప్ అవుతారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అధికార trs తో టచ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీని కలిపిస్తే కార్పొరేటర్ లు కూడా తమ ఆలోచన మార్చుకుంటారని, పార్టీ కోసం పని చేస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి కార్పొరేటర్లకు మోడీ అపాయింట్ మెంట్ తో, బీజేపీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!