Modi : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కలవడం వెనుక మోడీ ప్లాన్ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం రావడంతో వాయిదా పడింది. మోడీని కలవాలనుకున్న కార్పొరేటర్లు, వర్షం రావడంతో తీవ్ర నిరాశ చెందారు.
అయితే, కార్పొరేటర్లు నిరుత్సాహపడ్డారని భావించిన రాష్ట్ర బీజేపీ నాయకులు, కలిసే అవకాశం ఇవ్వాలని ప్రధాని కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రధాని వారికి టైమ్ ఇచ్చారు. గ్రేటర్ కార్పొరేటర్లు,ghmc పరిధిలో ఉండే రాష్ట్ర పదాధికారులు, ఆపై స్థాయి నేతలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలుస్తున్నారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో మోడీ హైదరాబాద్ కి వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి 15 రోజులు కూడా కావడం లేదు. అలాంటిది వీరికి సమయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో చాలా మునిసిపల్ కార్పొరేషన్ లు బిజెపి చేతిలో ఉన్నాయి. వాళ్లకు ఇవ్వని సమయాన్ని తెలంగాణ కు ఇచ్చారని, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు.
మోడీ ఏది చేసినా దాని వెనుక ఓ లెక్క ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. బలమైన సంకేతాలు ఇవ్వడం కోసమే, మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తెలంగాణపై తానే స్వయంగా రంగంలోకి దిగాను అనే సిగ్నల్ ఇవ్వడం కోసమే, చోటామోటా నేతలకు సైతం మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. దీంతో కార్పొరేటర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పార్టీ కార్యకర్తల్లో జోష్ వస్తుందని చెబుతున్నారు. రాజకీయంగా చర్చ జరుగుతుందని, కార్పొరేటర్ లకు మోడీ టైమ్ ఇవ్వడంపై ప్రజల్లో కూడా డిస్కషన్ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, బీజేపీ కార్పొరేటర్ లు కూడా పార్టీ జంప్ అవుతారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అధికార trs తో టచ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీని కలిపిస్తే కార్పొరేటర్ లు కూడా తమ ఆలోచన మార్చుకుంటారని, పార్టీ కోసం పని చేస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి కార్పొరేటర్లకు మోడీ అపాయింట్ మెంట్ తో, బీజేపీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!