బీజేపీలోకి తెలంగాణ ఉద్యమ నేత జంప్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి అవకాశాలు ఇచ్చింది. ఆ విధంగా స్వామిగౌడ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆపై శాసనమండలి ఛైర్మన్గానూ ఉన్నారు. టీజీవో అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్గౌడ్.. ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా కలిసి రాలేదు. దీంతో ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే కోవలో మరో ఉద్యోగ సంఘాల నేత విఠల్ను TSPSC సభ్యుడిగా అవకాశం కల్పించింది అధికారపార్టీ. ఇలా ఉద్యమకాలం నుంచీ కలిసి వచ్చిన వాళ్లు ఇప్పుడు టీఆర్ఎస్లో కుదురుకోలేకపోతున్నారో ఏమో.. ఆపార్టీని వీడి విపక్షపార్టీలలోకి జంప్ అవుతున్నారు.
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
బీజేపీలో చేరిపోయిన స్వామిగౌడ్..!
విఠల్ సైతం బీజేపీలో చేరిక..!
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ముందుగా స్వామిగౌడ్ టీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరిపోయారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఆయనలో బలంగా ఉండిపోయింది. అది నెరవేరకపోవడంతో టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు స్వామిగౌడ్. ఇప్పుడు విఠల్ వంతు వచ్చింది. బీజేపీ కండువా కప్పేసుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం సైలెంట్గా ఉన్న ఈ ఇద్దరు నాయకులు.. పదవీకాలం ముగిశాక వేరేదారి చూసుకోవడం వెనక ఉన్న కారణం ఏంటి? ఈ అంశంపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల్లో తమ మాజీ నేతల తీరుపై చర్చ..!
టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది. పై రెండు ఎపిసోడ్లు గమనించిన వాళ్లు.. తాజా పరిణామాలను బేరీజు వేసుకుని.. ఏం జరగబోతుంద్నదానిపై రకరకాల చర్చలు చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న నేతల దగ్గర ఆరా తీస్తున్నారట. రాజకీయ పార్టీల వైఖరి ఏదైనా.. ఉద్యోగ సంఘాల్లో మాత్రం.. మన మాజీ నాయకులకు ఏమైంది? ఉద్యోగ సంఘాలలో భవిష్యత్లో వచ్చే మార్పులు.. చేర్పులపై చెవులు కొరుక్కుంటున్నట్టు సమాచారం.
- Tags
- bjp
- off the record
- telangana
- TRS
తాజావార్తలు
-
Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
-
Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
-
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
-
Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!