Off The Record: గుంటూరులో ఆ నేత వైసీపీకి వెన్నుపోటు పొడిచారు? పదవిని ఎందుకు వదిలేసుకున్నారు?
- గుంటూరు కార్పొరేషన్ చేజారడంపై వైసీపీలో అంతర్మధనం
- మొత్తం 57కుగాను 46చోట్ల వైసీపీ గెలుపు
- స్టాండింగ్ కమిటీ ఎన్నికలో మారిపోయిన సమీకరణలు
- సడన్గా రాజీనామా ప్రకటించిన మేయర్ కావటి మనోహర్
- పార్టీ నేతల ఫోన్స్ కూడా తీయని వైనం
- గుంటూరులో ఎట్నుంచి ఎటు లెక్కేసినా వైసీపీకే బలం
- మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా వీగిపోయే అవకాశం
- అన్నీ తెలిసి కూడా కావటి ఎందుకు రాజీనామా చేశారు?
- కేసులకు భయపడ్డారని కొందరి వాదన
- కూటమి గట్టి ఆఫర్స్ ఇచ్చి ఉండవచ్చన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: గుంటూరులో వైసీపీకి వెన్నుపోటు పొడిచిందెవరు… సరిపడా బలం ఉండి కూడా మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేశారు? చివరికి పీఠాన్ని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది? అసలు పార్టీలో ఎవరికీ చెప్పకుండా కావటి మనోహర్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? వైసీపీ పోస్టుమార్టంలో ఏం తేలింది?
Read Also: TG RTC JAC: ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..
Also Read
గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ… తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే…. అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి. మేయర్గా కావటి మనోహర్, డిప్యూటీ మేయర్లుగా డైమండ్ బాబు, షేక్ సజీల ఎన్నికయ్యారు. మూడేళ్లు అంతా బాగానే ఉంది. కానీ… ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ సజీల, మరో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో మరో 11మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అప్పుడు మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేసినట్టు చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఏమైందోగానీ… సడన్గా మేయర్ కావటి మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Off The Record: వైసీపీలో అత్యంత కీలక మార్పులు.. వైఎస్ జగన్ క్లియర్ కట్ ఇండికేషన్స్
అయితే, మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారాయన. వైసీపీ అధిష్టానానికి అదో షాక్. కమిషనర్తో పొసగకుంటే మేయర్ రాజీనామా చేస్తారా అంటూ నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట వైసీపీ పెద్దలు. మనోహర్ రాజీనామా ప్రకటించిన వెంటనే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫోన్ చేసినా…ఆయన లిప్ట్ చెయ్యలేదట. మరికొంతమంది పార్టీ నేతలు ఫోన్ చేసినా స్పందన లేదని చెప్పుకుంటున్నారు. అసలు మనోహర్ ఎవరికీ చెప్పకుండా అంత సడన్గా ఎలా నిర్ణయం తీసుకున్నారన్నది అంతుబట్టలేదట వైసీపీ పెద్దలకు. దీంతో కొంతమంది పార్టీపెద్దలు అసలు ఏం జరిగిందనేదానిపై ఆరా తీశారట. స్థానికంగా ఉన్న నాయకులతో కూడా మాట్లాడి సమాచారం సేకరించినట్టు తెలిసింది. వాస్తవానికి కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుంటూరు వైసీపీ చేజారే పరిస్థితి లేదు. మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిటీలో 57మంది కార్పరేటర్లు ఉన్నారు.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
ఇక, వైసీపీ బలం 46 కాగా… ఒకరు చనిపోయారు. ఎన్నికలకు ముందు ఐదుగురు, ఎన్నికల తర్వా త 12 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరారు. మేయర్ మీద కూటమి అవిశ్వాసం పెట్టాలంటే టూ థర్డ్ మెజారిటీ ఉండాలి. అవిశ్వాసం పెడితే 42 మంది మేయర్కు వ్యతిరేకంగా ఓటెయ్యాలి. కానీ కూటమికి అంత బలం లేదు. అవిశ్వాసం పెట్టినా వైసీపీకి 27మంది కార్పొరేటర్ల బలం ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఒకరిద్దరు ప్లేటు ఫిరాయించినా ఇబ్బంది లేదు. అయినాసరే… ఈ లెక్కలన్నీ తెలిసి కూడా కావటి మనోహర్ రాజీనామా చెయ్యడం కూటమికి కలిసి వచ్చిందని అంటున్నారు. బలం ఉన్నాసరే… ఆయన ఎందుకు రాజీనామా చేశారు… అవిశ్వాసం పెట్టినా సరే… వైసీపీకి అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నా ఎందుకిలా జరిగిందని పోస్టుమార్టం చేస్తున్నారట వైసీపీ లీడర్స్. అయితే, కేసులకు భయపడి ఆయన అలా చేసి ఉండవచ్చని అంటున్నారట కొందరు. అదే సమయంలో కూటమి ఆఫర్స్కు పడిపోయారా అని కూడా మాట్లాడుకుంటున్నారట. కారణం ఏదైనా…. బలం ఉన్నచోట దాన్ని నిరూపించుకునే అవకాశం లేకుండా మనోహర్ దెబ్బతీశారన్న చర్చ జరుగుతోందట వైసీపీలో.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!