Off The Record: కేబినెట్ విస్తరణకు ముందు అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువ?
- కేబినెట్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నాలు..
- కొత్తగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన..
- బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు దాదాపు ఖరారు..
- పరిశీలనలో ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పేర్లు?..
- ఆది శ్రీనివాస్పై అధిష్టానానికి ఫిర్యాదులు..
- ఆయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని కంప్లయింట్..
- ప్రభుత్వం తరపున బీఆర్ఎస్, బీజేపీలకు ఆది గట్టి కౌంటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పిసిసి కమిటీ, కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది. PCC కమిటీలో పెద్దగా పోటీ దారులు ఉండకపోవచ్చు గానీ…. కేబినెట్ విషయంలో మాత్రం ఆశావాహులు ఎక్కువ. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ, అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట. కేబినెట్లో కొత్తగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న దిశగా చర్చ జరుగుతోందట. బీసీ కోటాలో.. పాలమూరు జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు దాదాపు ఖరారైంది. రెడ్లకు ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నందున మరో బీసీకి కూడా ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం.
Read Also: Off The Record: కేసీఆర్ దగ్గర కవిత రెండు ప్రధాన డిమాండ్స్ పెట్టారా..?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
దీంతో బీసీ ఎమ్మెల్యేల్లో పోటీ మొదలైందని అంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఐతే.. కరీంనగర్ జిల్లా నుంచి మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. మాకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఫీలింగ్ ఆ సామాజిక వర్గంలో ఉందట. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి మంత్రి వర్గంలో చోటు కల్పించే అంశాన్ని సీరియస్గానే ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు. అటు యాదవుల నుండి కూడా ఒత్తిడి ఉంది. ఈ కుల సమీకరణలు, వ్యవహారాలు ఇలా ఉంటే…. రేస్లో ఉన్న ఆది శ్రీనివాస్ పై.. అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయట. ఆది శ్రీనివాస్ రాజకీయ మూలాలు బీజేపీలో ఉన్నాయని, ఆర్ఎస్ఎస్లో ఆయన కెరీర్ మొదలైందని, అసలు 2014లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి.. బీజేపీకి మద్దతుగా నిలిచారంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు. అదంతా వేరే సంగతిగానీ.. ప్రస్తుతానికైతే… అటు బీజేపీ…ఇటు brs నుండి వచ్చే విమర్శలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్కువగా కౌంటర్ చేస్తోంది ఆది శ్రీనివాసేనని అంటున్నారు. దీంతో ఆయన అవకాశాలకు గండి పడుతుందా లేక రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం అని పార్టీ పెద్దలు భావిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా… ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్ పార్టీ కల్చర్ మరోసారి బయటపడ్డట్టయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్కడ ఫిర్యాదుల పెట్టెలు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయని, ఈసారి ఎవరు కంప్లయింట్ చేశారు? ఎందుకు చేశారని ఆరాతీస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!