Minister Balineni: సెబ్ సెగతో ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మంత్రికి సెబ్ సెగ గట్టిగానే తాకిందా? సెబ్ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ?
సమీక్షా సమావేశంలో ‘సెబ్’ అధికారులపై మంత్రి ఫైర్
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాల్లో ఆయన చెప్పిందే వేదం.. శాసనం. అలాంటి మంత్రిని కూడా పట్టించుకోవడం లేదట ఓ ప్రభుత్వ విభాగం. అదే.. ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేసే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో.. సెబ్. ఒంగోలు అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి బాలినేని. ఆ మీటింగ్కు సెబ్ అధికారులు కూడా వచ్చారు. ఆ విభాగం వంతు వచ్చేసరికి మంత్రి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. దాంతో మంత్రి ఎందుకు ఆ స్థాయిలో కోప్పడ్డారు అనేదానిపై ఒక్కటే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
మంత్రి ముఖ్య అనుచరుడిపైనే ‘సెబ్’ కేసు..!
అక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు అక్రమ ఇసుక తరలింపునూ అడ్డుకునే అధికారం సెబ్కు అప్పగించారు. ఆ మధ్య కొత్తపట్నం మండల పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకుంటున్న రైతుపై కేసు పెట్టారట. గ్రామస్థులు రోజంతా ఆందోళన చేయడంతో సెబ్ అధికారులకు అప్పుడే వార్నింగ్ ఇచ్చారట మంత్రి బాలినేని. అలాగే జిల్లాలో ఎక్కువ అక్రమ మద్యం కేసులు నమోదవుతున్నాయని ఒక సందర్భంలో సీఎం జగన్ మంత్రితో అన్నారట. ఇదే సమయంలో కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన మంత్రి ముఖ్య అనుచరుడిపైనే సెబ్ అధికారులు కేసు నమోదు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. అది బాలినేనికి మరింత ఆగ్రహం కలిగించినట్టు సమాచారం. వాస్తవానికి గ్రామంలో ఎవరి వాహనాలనైనా సెబ్ అడ్డగిస్తే మంత్రి బాలినేనితో మాట్లాడి విడిపించే బాధ్యత ఆ అనుచరుడిదేనట. అలాంటి వ్యక్తిపైనే కేసు పెట్టడంతో సంచలనంగా మారింది.
మంత్రి బాలినేని ఫోన్ చేసినా స్పందించని ‘సెబ్’ అధికారులు?
ఆ కేసు విషయంలో సెబ్ అధికారులను మాత్రమే పిలిచి ప్రశ్నిస్తే లేనిపోని రచ్చ అవుతుందని అనుకున్నారో ఏమో.. ఒంగోలు సమీక్ష పేరుతో అన్ని ప్రభుత్వ విభాగాలను మంత్రి సమావేశానికి పిలిచినట్టు టాక్. ఆ సమీక్షలో సెబ్ వంతు రాగానే బాలినేని బరస్ట్ అయ్యారని అనుకుంటున్నారు. మంత్రి ముఖ్య అనుచరుడిపై కేసు నమోదు చేసిన సమయంలో గ్రామస్థులంతా ఏకమై సెబ్ సీఐ లతతోపాటు పలువురు అధికారులను రౌండప్ చేశారట. ఉదయం నుంచి సాయంత్ర వరకు సమస్య తేలకపోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారట సెబ్ అధికారులు. ఆ ఘటనపై సీఐ లత ఫిర్యాదు చేయడంతో కేసు కట్టేశారట. ఆ ఘటనపై మంత్రి బాలినేని ఫోన్ చేసినా సెబ్ అధికారులు స్పందించలేదట. ముఖ్య అనుచరుడిపైనే కేసు నమోదు చేసి అమాత్యుల వారికి షాక్ ఇచ్చారు సెబ్ అధికారులు.
మంత్రిని ‘సెబ్’ అధికారులు లైట్ తీసుకున్నారా?
ఆ కేసుతో లోకల్ అధికారపార్టీ నేతల రగిలిపోతున్నారట. మంత్రి బాలినేని మాట్లాడినా కేసు నమోదైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అధికారపార్టీకి చెందిన తమ వాహనాలపైనే కేసు పెడితే.. గ్రామాల్లో తలెత్తుకుని ఎలా తిరుగుతామని నిలదీసినట్టు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ వల్లే మీటింగ్లో సెబ్ అధికారులపై మంత్రి బాలినేని నిప్పులు చెరిగారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్లో అధికారులు మంత్రిని లైట్ తీసుకోవడం.. ఆయన మంత్రి అయితే మాకేంటని వ్యవహరించడం చర్చగా మారింది. మంత్రి చెప్పినా వినకపోవడం.. ఆయన ఫోన్ చేసినా స్పందించకపోవడం సెగలు రేపుతున్నట్టు సమాచారం. మరి.. ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో.. మంత్రిగారి ఆగ్రహం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!