YCP: ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు అదే చేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధానిలో కీలక ప్రాంతం గుంటూరు. మున్సిపల్ కార్పొరేషన్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై కోర్టుకు వెళ్లడంతో గుంటూరు కార్పొరేషన్కు పదేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. ఆ సమయంలో అధికారులే కీలకంగా మారారు. గుంటూరు అభివృద్ది కూడా నత్తనడకన సాగింది. ఏడాదిన్నర క్రితం ఎన్నికలు జరగడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని జనం ఆశించారు. కొత్త పాలకవర్గం కొలువుదీరింది కానీ.. సీన్ మాత్రం మారిపోయింది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని.. ఇప్పుడు పదవి ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఎలా అని మెజారిటీ కార్పొరేటర్లు కౌంటర్లు తెరిచారట. సైడ్ ఇన్కం కోసం కొత్త దారులు తొక్కుతున్నారట. ఇదే ప్రస్తుతం గుంటూరులో హాట్ టాపిక్గా మారింది.
తమ పరిధిలో జరిగే వర్కులు చేసే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకోవడం అన్ని చోట్లా జరిగే తంతే. కాకపోతే ఆదాయం కోసం కొంతమంది చేసే కక్కుర్తి పనులే అధికారపార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయట. ఎక్కడైనా కొత్తగా నిర్మాణ పనులు మొదలుపెడితే.. అక్కడికి కూలీల కంటే ముందే కార్పొరేటర్లు లేదా వారి అనుచరులు వాలిపోతున్నారట. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు సరే.. మా సంగతి ఏంటి అని ముఖం మీదే అడిగి జేబులు నింపుకొని వెళ్తున్నారట. నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా.. లోపాలు వెతికి బరువు పెంచేస్తామని హెచ్చరిస్తున్నారట. అప్పటికీ మాట వినని వారి దగ్గరకు అధికారులను పంపి లేనిపోని హడావిడి చేస్తున్నారట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఆ మధ్య గుంటూరులో ఒకే సామాజికవర్గానికి చెందిన కొందరు కలిసి అపార్ట్మెంట్ కట్టుకుందామని భావించారు. ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారట. వెంటనే ఆ ఏరియాలోని కార్పొరేటర్ కుమారుడు ఎంట్రీ ఇచ్చారట. ముందు మా వాటా సంగతి తేల్చాలని హుకుం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ విషయాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడు దగ్గరకు తీసుకెళ్లారట. అదేంటీ అని ఆశ్చర్యపోయిన ఆ నాయకుడు.. తర్వాత రివర్స్ అయినట్టు తెలుస్తోంది. చివరకు ఏం చేసేది లేక.. కొంతమొత్తం అప్పగించి పనులు ప్రారంభించారట ఆ కమ్యూనిటీ ప్రతినిధులు.
నగరంలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించే వారిని పిలిపించిన ఓ కార్పొరేటర్ తన సంగతేంటని ప్రశ్నించారట. ఎప్పటి నుంచో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని.. ఇప్పుడేం చేయాలని వారు ఎదురు తిరగడంతో.. ఆ కార్పొరేటర్ ఇగో హర్ట్ అయిందట. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను పంపించి షాపుల ముందు మెట్లను నేలమట్టం చేయించారట. దాంతో బెంబేలెత్తిపోయిన వ్యాపారులు ఆ నేతను గట్టి బరువుతోనే ప్రసన్నం చేసుకున్నారట. ఇదే విధంగా మరో కార్పొరేటర్ తన పరిధిలోని షాపుల నుంచి కొంత మొత్తం డిమాండ్ చేశాడట. ఆ విషయాన్ని నగరంలోని ప్రముఖ నేత వద్దకు తీసుకెళ్లారట వ్యాపారులు. వెంటనే ఆ నేత కార్పొరేటర్కు ఫోన్ చేసి.. ఇదేం పద్ధతి అని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆ కార్పొరేటర్.. ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి గెలిచింది ఇందుకేనా అని నిలదీశారట. అదే విషయం అనుచరుల దగ్గర చెప్పి వాపోయారట.
ఇటీవల ఓ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన వ్యక్తికి ఒక కార్పొరేటర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఏంటా అని ఆరా తీస్తే నా సంగతేంటి అని అసలు విషయం బయట పెట్టాడట. ఆ సంగతి అధికారపార్టీ పెద్దల వద్దకు చేరింది. వెంటనే ఆ కార్పొరేటర్కు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ఇలాంటి ఉదాహరణలు గుంటూరులో చాలా ఉన్నాయనేది స్థానికంగా వినిపించే మాట. స్థానికులు కూడా వాటిని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇప్పటికే వసూళ్ల రాజాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. పార్టీ పెద్దలు అది గమనించినట్టు తెలుస్తోంది. మరి.. సైడ్ బిజినెస్కు చెక్ పెడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!