IPL 2025: పిల్లలు సెంచరీలు కొడుతున్నారు…కొంచెమైనా బుద్ది ఉండక్కర్లా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేలంలో ఒక ప్లేయర్ భారీ ధర పలికాడంటే.. కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ అతనిపై భారీ ఆశలే పెట్టుకుని ఉంటుంది. కానీ కొందరు కాస్ట్లీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీల నమ్మకాన్ని ఏ మాత్రం నిలుపుకోలేకపోతున్నారు. మ్యాచ్ విన్నర్లు అని కోట్లిచ్చి కొనుక్కుంటే.. జట్టుకు భారమవుతున్నారు. ఈ ఐపీఎల్ లో భారీ ధర పలికిన వారిలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు రిషభ్ పంత్ కాగా మరొకరు వెంకటేశ్ అయ్యర్. లక్నో సూపర్ జాయింట్స్ కేఎల్ రాహుల్ ని విడుదల చేసి రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకుంది.
Read More: Story Board : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం ఎలా? పాక్కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమేనా?
Also Read
- Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
- Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ఏకంగా 27 కోట్లతో పంత్ ని తమ జట్టులో చేర్చుకుంది. కానీ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. చెత్త షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు. అతని బ్యాటింగ్ తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా పంత్ లో మార్పు కనిపించడం లేదు. అవసరం లేని షాట్లకు పోయి పరువు తీసుకుంటున్నాడు. ఈ సీజన్లో రిషబ్ 10 మ్యాచుల్లో 98 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 110 పరుగులు చేశాడు. ఈ పది మ్యాచుల్లో పంత్ ఒక మ్యాచులో మాత్రమే ఫిఫ్టీ కొట్టాడు. గతేడాది లక్నో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 14 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 520 పరుగులు చేశాడు. అయినా ఆ జట్టులో అతనికి గౌరవం దక్కలేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్ ని తిట్టడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. దాంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రాహుల్ లక్నోని వీడాలనుకున్నాడు.
Read More:BHOGI : శర్వానంద్ ‘భోగీ’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్..
రాహుల్ స్థానంలో వచ్చిన పంత్ చెత్త ప్రదర్శన కారణంగా పాపం గోయెంకా తలపట్టుకుంటున్నాడు. వేలంలో 23 కోట్ల భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ ని నిండా ముంచేశాడు. 10 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీతో 142 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. 7 ఇన్నింగ్స్లలో 4 సార్లు 2 అంకెలు స్కోర్ కూడా చేరుకోలేకపోయాడు. వెంకటేశ్ అయ్యర్ మీద ఖర్చు చేసిన డబ్బుని మిచెల్ స్టార్క్,లేదా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు మీద ఖర్చు చేసి ఉంటె ఈ రోజు కేకేఆర్ పరిస్థితి మరోలా ఉండేది. వచ్చే సీజన్ లో లక్నో రిషభ్ పంత్ను.. కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్లను వేలంలోకి వదలడం ఖాయం. ఫ్యాన్స్ కూడా ఇదే భావిస్తున్నారు. పిల్లలు సెంచరీలు కొడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!