Maharastra CM: నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు..
- ముంబైలో పెరుగుతున్న హిండ్ అండ్ రన్ కేేసులు
- స్పందించిన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
- నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్యాయాన్ని సహించేది లేదు- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ధనవంతులైనా, రాజకీయ నాయకులు, వారి పిల్లలు అయినా అన్యాయాన్ని సహించనని తెలిపారు. హిట్ అండ్ రన్ నేరస్థులకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను, కఠిన శిక్షలను అమలు చేస్తోందని షిండే ట్వీట్లో పేర్కొన్నారు.
MP: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేసిన రావత్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
‘సాధారణ ప్రజల జీవితాలు మాకు విలువైనవి. ఈ కేసులను అత్యంత సీరియస్గా తీసుకుని.. న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీసు శాఖను నేను ఆదేశించాను.’ రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షిండే చెప్పారు. బాధితులకు, వారి కుటుంబాలకు తన ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..
కాగా.. ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. శివసేన షిండే వర్గానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు మిహిర్ షా తన బిఎమ్డబ్ల్యూ కారుతో బైక్పై వెళ్తున్న దంపతలును ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. ఆ కారు మహిళను 2 కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు స్కూటర్ను ఢీకొట్టడంతో డ్యూటీలో ఉన్న పూణే పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!