Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..
- ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమం
- దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా
- కూల్చివేతలపై మండిపడిన ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని.. కూల్చిన ఇళ్లకు పరిహారం, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈటల పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో దమ్ముంటే ప్రభుత్వం విచారణ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. పేద మధ్య తరగతి వారు రూపాయి రూపాయి పోగు చేసి కొనుక్కున్నారని.. అన్ని అనుమతులు తీస్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్లు కుల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు అనుమతులు అధికారులే ఇచ్చారు.. ఈనాడు వచ్చి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అయినా, రేవంత్ ప్రభుత్వం అయినా పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. గంజాయి అమ్మేవాళ్ళను ఆపే తెలివి లేదు కానీ వందల మంది పోలీసులను వేసుకొని పేదల ఇళ్లు కూలగొట్టడానికి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ ఓడిపోయారన్నారు. ఒళ్లు వంచి కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని.. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లు కూల్చారంటూ ఆగ్రహించారు. పేదల మీద దండయాత్ర చేయడమే న్యాయమా అంటూ ప్రశ్నించారు. అందినకాడికి దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారన్నారు. చట్టం మరచి, బాధ్యత మరచి బానిసలుగా పని చేస్తే జైలుపాలు అయిన అధికారులు ఉన్నారన్నారు. అధికారులు సత్యం ప్రకారం పని చేయాలని.. రెవెన్యూ అధికారులకు హెచ్చరిస్తున్నామని.. చట్టానికి అనుగుణంగా పని చేయాలని.. పేదల మీద దౌర్జన్యం చేయొద్దని ఈటల రాజేందర్ సూచించారు.
తాజావార్తలు
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!