Pawan Kalyan: విసన్నపేట భూములపై గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తాం.. ఏంటి ఈ దోపిడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: విసన్న పేట భూముల మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటకు చేరుకున్న పవన్.. వివాదాస్పద భూములను పరిశీలించారు.. సర్వే నెంబర్ 195/2లోని 609 ఎకరాలను అధికార పార్టీ నాయకుల అండతో ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకున్నారని ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ.. మంత్రి అమర్నాథ్, ఆయన అనుచరులు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.. అయితే, జనసేన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విస్సన్నపేట భూముల్లో తనకు సెంటు స్థలం ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. తన ప్రమేయం కానీ.. భూమి ఉన్నట్టు నిరూపించినా జనసేనకు రాసిచ్చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం విదితమే.
ఇక, విసన్నపేటలో భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంపై గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తాం అని ప్రకటించారు.. విస్సన్నపేటలో
అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. వోల్టా చట్టం తుంగలో తొక్కారని విమర్శించారు. ఉత్తరాంధ్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అని ఆరోపించారు. ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. విస్సన్నపేటకు రావడానికి ఇరుకు రోడ్ ఉంది.. కానీ, వీరి రియల్ ఎస్టేట్ కి మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు పవన్ కల్యాణ్. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కాదు.. నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డినే అడుగుతున్నాను.. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం.. కొండలను పిండి చేశారు, ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, అభివృద్ది జరగడం పట్ల మాకు అభ్యంతరం లేదు.. ఒక వైపు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు మరో వైపు 13 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోపిడీ చేస్తే ఎలా ఊరుకోవాలి అంటూ మండిపడ్డారు పవన్.. ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ నాయకులు మాత్రం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వేల కోట్లు దోచేస్తున్నారన్న ఆయన.. విస్సన్న పేటలో 600 ఎకరాలకు పైగా పోరంబోకు, దళితుల భూములను దోచేసుకున్నారని ఆరోపించారు. ఇందులో వాటర్ బాడీస్ క్యాచ్ మెంట్ ఏరియా కూడా ఉంది. పకృతి విధ్వంసం, వోల్టా యాక్ట్ కు విరుద్ధం అన్నారు. ఇక్కడ వేస్తున్న రియల్ ఎస్టేట్ కు అనుమతులు లేవు.. ఉత్తరాంధ్ర భూములు దోచేస్తూ ఉంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు అని విమర్శించారు. తెలంగాణను ఇలానే దోచేస్తూ ఉంటేనే తన్ని తరిమేశారంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్జీటీ లాంటి కేంద్ర ఏజెన్సీ లకు ఫిర్యాదు చేస్తా.. మంత్రులు చేసే దోపిడీకి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి అంటూ సవాల్ చేశారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..