Samajika Sadhikara Bus Yatra: జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్లలో సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
Read Also: Constable Dismissed: వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షలను కాజేసిన కానిస్టేబుల్
Also Read
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంటే ప్రతిపక్షాలకు కడుపులో మండుతుంది అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఒకడు యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవచ్చు అంటాడు.. వాడి పిల్లలు యూట్యూబ్ చూస్తే నేర్చుకుంటున్నారా , వాడు యూట్యూబ్ చూసే సినిమాలు చేస్తున్నాడా?.. ప్రతిపక్షాలన్నీ ఏకమైన కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవు జగన్మోహన్ రెడ్డి కటౌట్ పట్టుకొని ప్రజల్లోకి వెళతాం అని ఆయన వెల్లడించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ పార్టీ చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ఐదుగురిని రాజ్యసభకు పంపిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు.
Read Also: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
ఇక, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ దళితులను జైళ్లకు పంపితే జగన్మోహన్ రెడ్డి దళితులను పార్లమెంటుకు పంపారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత జీవితాలు అనుభవించాలంటే 20 సంవత్సరాల పాటు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి అని ఆయన అన్నారు. ఆదమరిస్తే ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మన పిల్లల జీవితాలు మన జీవితాలు తిరిగి వెనక్కు వెళ్లిపోతాయి.. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వారి అవకాశాల కోసం వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మన కోసం వచ్చారు పేద బడుగు బలహీన వర్గాల కోసం వచ్చారు అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. అంతు చూస్తా అన్నవాడు జైలుకు పోయాడు భయపెడతా అన్న కొడుకు భయపడి ఢిల్లీ పారిపోయి విగ్గురాజు దగ్గర దాక్కున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!