Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandra Grahan Effect Andhra Pradesh Temples Are Closed

Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..

NTV Telugu Twitter
Published Date :October 28, 2023 , 7:41 pm
By Chandra Shekhar
Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాక్షిక చంద్రగ్రహణంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. ఇవాళ ఏపీలోని అన్ని ఆలయాల తలుపులు మూసివేశారు. దాదాపు 8 గంటల పాటు ఆలయాల తలుపులు మూసి ఉంచనున్నారు. అలాగే రేపు తెల్లవారు జాము నుంచి సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక, చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.. సుప్రభాతం ఏకాంతంగా నిర్వహించి.. తోమాల, అర్చన సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నాని చెప్పారు. ఇవాళ 42 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Read Also: Miniter Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది..

అలాగే, చంద్రగ్రహణం వల్ల నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాలు, పరివార ఆలయాలను బంద్ చేశారు. రేపు తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి ఆర్జిత సేవలకు అనుమతించనున్నారు. ఈరోజు సాయంత్రం, రాత్రి జరిగే ఆర్జిత సేవ, శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం నిలుపివేశారు. రాత్రి భక్తులకు అందించే అల్పాహారం కూడా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Allu Arjun : వరుణ్ – లావణ్య పెళ్లి కోసం కుటుంబ సమేతంగా ఇటలీ బయలుదేరిన ఐకాన్ స్టార్…

ఇక, రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము కూడా చంద్రగ్రహణంతో మూసివేశారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉప ఆలయముల కవాట బంధనం.. అమ్మవారికి పంచ హారతులను నిలిపి వేసి అర్చకులు కవాట బంధనం చేశారు. గ్రహణం అనంతరం రేపు ఉదయం వేకువజామున 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు చేయనున్నారు. రేపు ఉదయం9 గంటలకు ప్రతీ నిత్యము వలనే భక్తులకు దర్శనము పునః ప్రారంభించి ఆర్జిత సేవలు నిర్వహణ చేస్తారు. రేపు తెల్లవారుఝామున నిర్వహించు ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చనను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమగు అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయని ఆలయాధికారులు తెలిపారు.

Read Also: Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!

అలాగే, చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడలోని అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం వ్రతాలు దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఇక, మహానందిలో ఆలయం మూసివేశారు. దేవతామూర్తులకు పవిత్రంతో ఆఛ్ఛాదన చేసిన వేద పండితులు.. రేపు ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ.. 8 గంటల నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇచ్చింది. ఇక, చంద్రగ్రహణం కారణంగా పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రేపు ఉదయం ఐదు గంటలకు ఆలయ శుద్ది అనంతరం తెరిచుకోనున్న ఆలయం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandra Grahan 2023
  • Indrakiladri
  • Srisailam
  • Temples Are Closed

తాజావార్తలు

  • Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!

  • Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?

  • Black Box: కీలకంగా మారనున్న ‘‘బ్లాక్ బాక్స్’’.. విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది మృతి..!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions