Yarlagadda Venkat Rao: పూజలు నిర్వహించి.. ఎన్నికల ప్రచారం మొదలెట్టిన యార్లగడ్డ వెంకట్రావు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarlagadda Venkat Rao Starts Election Campaign in Gannavaram: గన్నవరం నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రామాలయంలో వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం యార్లగడ్డ తన ప్రచారం ఆరంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని యార్లగడ్డ హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న యార్లగడ్డ వెంకట్రావు.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యార్లగడ్డ మాట్లాడుతూ… ‘గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవటంతో పాటు అవినీతి, పక్షపాతం పెరిగిపోయి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విచ్చలవిడిగా అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో దోచుకు తిన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై దాడులు అధికమయ్యాయి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై లెక్కలేనని దాడులు చేసి.. ఎదురు బాధితుల పైనే కేసులు నమోదు చేశారు. ఈ దుస్థితిలో మార్పు వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Also Read: Kadiyam Srihari: కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య!
తనకు ఓ అవకాశం ఇస్తే.. గన్నవరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మారుపూడి సాంబశివరావు, ఆరెపల్లి రమేష్, మీసాల రామూర్తి, మాదాల నాని బాబు, యోగిశెట్టి రత్నాకరావు, నల్లమోతు వందనం, పమిడిముక్కల దావీదు, గుంటుపల్లి హర్ష, అంకం సాయి, అంకం వాసు, అంకం ఫణింద్ర, కోయ దుర్గాప్రసాద్, సెగ సతీష్, జనసేన నాయకులు పొదిలి దుర్గారావు మరియు బీజేపీ నాయకులు డాక్టర్ ఫణికుమార్, మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- ap
- bjp
- gannavaram
- janasena
- tdp
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!