Husband Killed: భర్తతో భార్య విడాకులు.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య
కాన్పూర్లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రియుడితో కలిసి తన భర్త గొంతుకోసి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్ ఉంచారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. మరో యువకుడితో రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఘటనను బయటపెట్టిన పోలీసులు నిందితులు ప్రియురాలు ప్రియుడిని జైలుకు పంపారు.
Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !
Also Read
- Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ఈ ఘటన కాన్పూర్లోని గోవింద్నగర్లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముఖేష్ నారంగ్ అనే వ్యక్తి ఇంట్లో అతని మృతదేహం లభ్యమైంది. ముఖేష్ భార్య దివ్య ఆ ప్రాంతంలోనే తన కోడలుతో కలిసి ఉంది. అయితే.. తన స్నేహితులు కొందరు ఇంటికి వస్తున్నారని.. అందుకే త్వరగా ఇంటికి వెళ్లాలని ముఖేష్ చెప్పాడని ముఖేష్ భార్య దివ్య పోలీసులకు తెలిపింది. తిరిగి వచ్చేసరికి గదిలో తన భర్త మృతదేహం పడి ఉందని దివ్య పోలీసులకు తెలిపింది.
MLA Jakkampudi Raja: అజ్ఞాన చక్రవర్తి లోకేష్ బాబు.. ముందు లెక్కలు నేర్చుకో నాయనా!
అయితే ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టగా.. పోస్టుమార్టం రిపోర్టులో వారికి అనుమానం వచ్చింది. పోలీసులు విచారణ ముమ్మరం చేసి సీసీటీవీలను పరిశీలించారు. ఘటన జరిగిన రోజు ఓ వ్యక్తి ముఖేష్ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీలో చూశారు. అతడిని సంజయ్ పాల్గా గుర్తించారు. దివ్య మొబైల్ వివరాలు రాబట్టిన పోలీసులు.. ఆమె సంజయ్తో చాలా కాలంగా టచ్లో ఉన్నట్లు తేలింది. సంజయ్, దివ్య ఇంతకుముందే ఒకరికొకరు తెలుసు. వారు ఒకే స్థలంలో నివసించేవారు. అంతేకాదు.. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా జరిగినదంతా చెప్పారు. ఘటన జరిగిన రోజు ముఖేష్కి దివ్య టీ చేసి ఇచ్చిందని దివ్య, ఆమె ప్రేమికుడు సంజయ్ పోలీసులకు తెలిపారు. టీలో నిద్రమాత్రలు వేశామని.. ముఖేష్ టీ తాగగానే నిద్రమత్తులో నిద్రలోకి జారుకున్నట్లు తెలిపారు. దీంతో దివ్య, ఆమె ప్రేమికుడు సంజయ్ కలిసి ముఖేష్ను గొంతుకోసి హత్య చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు దివ్య మృతదేహం దగ్గర విషపూరిత బాటిల్ను ఉంచారు.
తాజావార్తలు
-
Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!