MLA Jakkampudi Raja: అజ్ఞాన చక్రవర్తి లోకేష్ బాబు.. ముందు లెక్కలు నేర్చుకో నాయనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jakkampudi Raja: రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడు అని పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.. రాష్ట్ర ప్రజలను పప్పు ఎవరు అని అడిగితే అందరి నోటా ఒకరి పేరే వినపడుతుందని అది మన లోకేష్ బాబు అని విమర్శించారు.
Read Also: CM YS Jagan: తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తుంటే, తండ్రికి మచ్చ తెచ్చే తనయుడుగా లోకేష్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రకటిస్తే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అది ఎలా సాధ్యమవుతుందని అవహేళనగా మాట్లాడితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేసి నిరూపించామన్నారు. అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో అమ్మ ఒడి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమ్మఒడి ఒకరికి ఇస్తే 15వేలు, ఇద్దరికిస్తే 30 వేలు, ముగ్గురికి ఇస్తే మన లెక్కలో 45 వేలు అయితే, లోకేష్ లెక్కలో 90 వేల రూపాయలంట.. అది ఆయన జ్ఞానం? అంటూ ఆరోపించారు. లెక్కలు కూడా తెలియని వ్యక్తి నేడు పాదయాత్రలు చేసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో ఎవరు లేరు అన్నారు. ఇప్పటికైనా బూటకపు పాద యాత్రలు ఆపాలని లోకేష్కు హితవు పలికారు.
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..