Snakebite: పాముకాటుతో భార్య మృతి, షాక్తో గుండెపోటుతో భర్త మృతి..
- యూపీలోని వీర్పూర్ గ్రామంలో విషాదం పాముకాటుతో భార్య మృతి
- మృతదేహాన్ని చూసి షాక్ కు గురై గుండెపోటు భర్త మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ రాష్ట్రం ఘాజీపూర్లోని వీర్పూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చేటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మృతదేహాన్ని చూసిన కొంతసేపటికి భర్త కూడా షాక్కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారులు, కుమార్తెల రోదనలతో గ్రామస్తుల కంట కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ కోసం రెండు నెలల ముందు నుంచే “మృత్యువు” వెయిటింగ్..
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
వీర్పూర్ గ్రామానికి చెందిన శాంతిదేవి(40) సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసి ఇంటి ప్రాంగణంలో మంచంపై నిద్రిస్తోంది. అర్థరాత్రి పాము ఆమె కాలుకి కాటేసింది. ఈ క్రమంలో.. నిద్రపోతున్న మహిళ వెంటనే లేచి కేకలు వేసింది. దీంతో.. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని టార్చ్ లైట్ తో చుట్టు పక్కల చూశారు. అయితే వారికి పాము కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పామును చంపేశారు. అయితే.. మహిళ పరిస్థితి విషమిస్తుండటంతో ఆమ్వాకు చెందిన భూతవైద్యురాలు సతీ మాయి దగ్గరకు తీసుకువచ్చారు. ఆమె పాము కాటుకు వైద్యం చేసి పంపించింది. కాగా.. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో కోలుకుని ఇంటికి వచ్చినా కొంతసేపటికి శాంతిదేవి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది.
Read Also: Bunny Vasu: కల్కి కలెక్షన్స్ పై బన్నీ వాసు క్లారిటీ
దీంతో.. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆ మహిళను బీహార్ ప్రావిన్స్లోని ప్రతాప్గఢ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బక్సర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునేలోపే మృతురాలి భర్త రాంప్రవేష్ షాక్కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. భార్యాభర్తల మృతితో కుటుంబ సభ్యుల్లో గందరగోళం నెలకొంది. కుమారులు, కూతుళ్ల రోదనలు చూసి గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!