Opposition Meeting: ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల భేటీ.. ఎవరేమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Meeting: శుక్రవారం బీహార్లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను ముందుగా మాట్లాడాలని కోరారని, అయితే మిగతా నేతలందరి మాటలు విన్న తర్వాతే చివరిగా మాట్లాడతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మొదట మాట్లాడారు. విపక్షాల ఐక్యతకు ఈ సమావేశాన్ని మొదటి అడుగు అని అభివర్ణించారు. 2024 నాటికి మరిన్ని పార్టీలు ఈ కూటమిలో చేరతాయని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ నాయకత్వం వహించాలని, ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. “పెద్ద పార్టీలు విశాల హృదయాన్ని ప్రదర్శించాలి. సీట్ల పంపకాల ఏర్పాట్లకు కాంగ్రెస్ ఓపెన్, ఫ్లెక్సిబుల్గా ఉండాలి” అని ఆయన అన్నారు. ఎన్నికల కోసమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ఒక్క ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి ఉండాలని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాదించారు. ఇది భారత ప్రజలకు వర్సెస్ మోదీకి మధ్య జరుగుతున్న పోరాటం అని ఆమె అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు వేర్వేరు ఫార్ములా ఉండాలన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ నేతృత్వంలో రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. పొత్తు లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా సీట్ల పంపకం లేదా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే దీనిని నియంతృత్వంపై పోరాటం అని అభివర్ణించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించకూడదని కట్టుబడి ఉందన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్పై కాంగ్రెస్ ఈరోజే తమ నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read: Monsoon Update: హిమాచల్, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడాన్ని ఉదహరించిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాశ్మీర్కు జరిగింది కేవలం కాశ్మీర్కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ చేస్తుందని అన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ పార్టీ పెద్ద రాష్ట్రానికి చెందినదని, అందుకే మాకు పెద్ద మనసు ఉంటుందన్నారు. సీట్ల పంపకం లేదా ఉమ్మడి అభ్యర్థుల ఏర్పాటు కోసం తాము సిద్ధంగా ఉన్నామని, తాము కాంగ్రెస్కు వ్యతిరేకం కాదని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అన్నారు.
Also Read: All-Party Meeting: మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. భావసారూప్యత గల పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, అయితే సమావేశానికి కొద్ది నిమిషాల ముందు ఆప్ అధికార ప్రతినిధి వివాదాస్పద ప్రకటనను కూడా గుప్పించారు. “పార్లమెంట్ సెషన్లో ప్రతిపక్షాలు క్రమం తప్పకుండా సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందిస్తాయి. ఆ సమావేశాలకు ఆప్ హాజరయింది. ఈ ఆర్డినెన్స్కు వేరే యంత్రాంగం ఎందుకు ఉండాలి? బీజేపీతో పోరాడేందుకు కూటమికి ఇది ముందస్తు షరతు కాకూడదు” అని ఆయన అన్నారు. .
ఆ తర్వాత ఆప్, కాంగ్రెస్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి, ఇందులో మమతా బెనర్జీ, ఇతర నాయకులు జోక్యం చేసుకున్నారు. నిన్నటి సమావేశంలో ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరి కోసం కేజ్రీవాల్ పట్టుబట్టడంపై వారు ప్రశ్నించారు. పొత్తు విషయంలో తమ పార్టీకి ఓపెన్ మైండ్ ఉందని, గతాన్ని మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. తదుపరి సమావేశం సిమ్లాలో కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించబడుతుందని ఈ సమావేశంలో నిర్ణయించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!