All-Party Meeting: మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All-Party Meeting: మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తదితరులు హాజరయ్యారు. అమిత్ షా శాంతి కోసం ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మేలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. మణిపూర్లో ఈ అంశంపై విపక్షాలు బీజేపీని దూషించాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
Also Read: Manipur: మంత్రి గోడౌన్కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
మణిపూర్లో మే 3 నుండి ఇంకా కాల్పుల వంటి సంఘటనలు జరుగుతున్నందున, శాంతికి మరింత విఘాతం కలగకుండా నిరోధించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను కూడా నిషేధించారు. మే 3న మణిపూర్లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ST) జాబితాలో చేర్చాలనే డిమాండ్కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ మాట్లాడుతూ మణిపూర్లో ప్రజల జీవితాలను నాశనం చేసిన అపూర్వమైన హింస “మన జాతి మనస్సాక్షికి లోతైన గాయాన్ని మిగిల్చింది” అని రాష్ట్రంలో శాంతి, సామరస్యం పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్పై కాంగ్రెస్ గళం విప్పింది. మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య జరిగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!