Monsoon Update: హిమాచల్, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Update: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో రోజంతా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ సమయంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 28 నాటికి రుతుపవనాలు ఢిల్లీ-ఎన్సీఆర్లోకి ప్రవేశిస్తాయని అంచనా.
యూపీకి హెచ్చరిక
ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యూపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ఉత్తరాఖండ్లో వేడి నుంచి ఉపశమనం
ఉత్తరాఖండ్లోని అనేక నగరాల్లో గత కొన్ని గంటలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం పొందారు. వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు ఉత్తరాఖండ్లో ఒకటి లేదా రెండు రోజుల్లో ఎప్పుడైనా తాకవచ్చు.
హిమాచల్లోకి రుతుపవనాలు ప్రవేశం
మరోవైపు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు ప్రవేశించాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక వర్షాలు కురిశాయని హిమాచల్ ప్రదేశ్ ఐఎండీ డైరెక్టర్ సురేంద్ర పాల్ తెలిపారు. జూన్ 25 నుంచి 26 వరకు దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జార్ఖండ్లో చురుకుగా రుతుపవనాలు
నేటి నుంచి జార్ఖండ్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25-26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గొడ్డా జిల్లా మినహా 23 జిల్లాల్లో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని, జూన్ 25-26 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
బీహార్లో వేడి నుంచి ఉపశమనం
ఇది కాకుండా బీహార్లో రుతుపవనాలు ప్రవేశించాయి. వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో బీహార్లో జూన్ 30 నుంచి జూలై 6 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒడిశాలో మరో 4 రోజులు వర్షాలు
అదే సమయంలో, ఒడిశాలో రుతుపవనాలు చురుకుగా మారాయి. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!