Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story What Is One Nation One Election

One Nation-One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటే ఏంటి?

Published Date :September 18, 2024 , 3:56 pm
By RAMAKRISHNA KENCHE
  • వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం
  • పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
  • మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ
  • 14 రాష్ట్రాలు సమర్థించాలి
One Nation-One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’  అంటే ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది. ఈ సమావేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచింది. ఈ క్రమంలో కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. అసలు ఒకే దేశం- ఒకే ఎన్నిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

READ MORE: Haryana Election: మహిళలకు నెలకు రెండు వేలు.. పేదలకు వంద గజాల భూమి

మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ.. 18 626 పేజీల నివేదిక..

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమై తన నివేదికను సమర్పించింది. ఈ 18,626 పేజీల నివేదికను తయారు చేసేందుకు కమిటీ ఈ బిల్లుపై కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను సమర్పించగా, వాటిలో 32 ఏకకాల ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు హెచ్‌ఎల్‌సితో విస్తృతంగా చర్చించాయి. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని వార్తాపత్రికలలో ప్రచురించబడిన పబ్లిక్ నోటీసుకు ప్రతిస్పందనగా, భారతదేశం నలుమూలల నుంచి 21,558 మంది పౌరులు స్పందించారు. ప్రతివాదులు 80 శాతం మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టులకు చెందిన పన్నెండు మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఎనిమిది మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ ఛైర్మన్ వంటి న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా కోరింది. ఇదిలా ఉండగా..

READ MORE:Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటే ఏంటి?

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అదే నిజమైంది. అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

READ MORE:Speaker Ayyanna Patrudu: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. స్పీకర్‌ భావోద్వేగం

14 రాష్ట్రాలు సమర్థించాలి..

ఈ బిల్లును ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. మొత్తం లోక్‌సభ స్థానాలు543. ఇందులో ఎన్డీఏకు 333 సీట్లు అంటే 61శాతానికి సమానం. అయితే ఇప్పుడు బీజేపీకి మరో 6 శాతం ఓటింగ్‌ అదనంగా అవసరం. ఈ ఆరు శాతం ఓటింగ్ ఎన్డీఏ కూటమికి కష్టమని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఇక అటు రాజ్యసభలో కేవలం 38 శాతం సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండటంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలేం జరుగుతుందో చూడాలంటే సమావేశాలు ప్రారంభం కావాల్సిందే.

READ MORE:CM Revath Reddy: రుణమాఫీ చేశాం..అయిన రైతుల బాధలు తప్పడం లేదు

అసలు జమిలీ ఎన్నిక అవసరం ఉందా?

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఎలాంటి లాభం ఉంటుందో చూద్దాం.. రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చులు చేస్తోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా ప్రజా ధనం వృథా అవుతోందని దాన్ని అరికట్టేందుకే జమిలీ ఎన్నికలను తీసుకురావాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది. 2019 లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఈసీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాజకీయ పార్టీలు అనధికారికంగా.. పెట్టే ఖర్చులు చెప్పనవసరం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. దీని కోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల వాదనలు వినాలంటే పార్లమెంట్ సమావేశాల వరకు ఆగాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • central government
  • congress
  • LATEST TELUGU NEWS
  • Parliament Sessions

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions