CM KCR: రాబోయే ఎన్నికల్లో వంద శాతం మనమే గెలుస్తాం.. దాంట్లో అనుమానమే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా గిరిజనులకు పోడు భూములకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అప్పట్లో మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి కానీ.. ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు. మరోవైపు 75 కోట్లతో కౌటాల వద్ద వార్ధా నది పై బ్రిడ్జి మంజూరు పత్రాన్ని సీఎం అధికారులకు అందజేశారు. అంతేకాకుండా ఆసిఫాబాద్కు ఐటీఐ కూడా మంజూరు చేస్తున్నట్లు.. నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Read Also: Rakul Preeth Singh : ఆ ముద్దు సీన్ లో నటించకుండా ఉండాల్సింది..
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
- India vs England: "బుడ్డోడా నీ ప్రతిభకు సలాం".. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
మరోవైపు ధరణి పోతే దళారీ రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి తీస్తాం అంటున్నారని.. అది తీస్తే రైతు బంధు ఎలా అందుతుందని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పోడు భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు. మరోవైపు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అక్కడ కూడా అమలు చేయాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నారని.. లేదంటే తెలంగాణలో కలిపేయాలని మహారాష్ట్రలోని వివిధ గ్రామాల సర్పంచులు డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు.
Read Also: Titan: ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది.. అంతలోనే మళ్లీ టైటానిక్ వద్దకు తీసుకెళ్తుందట..
ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్. సభ ముగిసిన అనంతరం.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కు బయల్దేరాడు.
- Tags
- BRS
- congress
- Dharani
- kcr
- telugu news
తాజావార్తలు
-
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
-
Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
-
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్లోకి ‘ఇసకపట్నం’!
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!