Titan: ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది.. అంతలోనే మళ్లీ టైటానిక్ వద్దకు తీసుకెళ్తుందట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్గేట్ ఎక్స్పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.
Read Also: India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
ఇదిలా ఉంటే ప్రమాదం జరిగి కొన్ని రోజులే అయింది. ఇంకా ఈ ప్రమాదం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఓషన్ గేట్ సంస్థ టైటానిక్ శిథిలాల వద్దకు తీసుకెళ్తామనే ప్రకటన విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురు ఓషన్ గేట్ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓషన్ గేట్ సంస్థ తన వెబ్సైట్లో తర్వాతి టైటానికి ట్రిప్ కు సంబంధించిన ప్రకటనను కొనసాగిస్తోంది. కంపెనీ 2024 జూన్ 12-20 మరియు జూన్ 21-29 వరకు రెండు విహారయాత్రలను ప్లాన్ చేస్తోంది. వెబ్సైట్ ప్రకారం, 8 డేస్-7 నైట్స్ ప్రయాణానికి ఒక్కొక్కరికి 250,000 డాలర్లు ఖర్చవుతుందని ప్రకటించింది. ఒక సబ్మెర్సిబుల్ డైవ్, ప్రైవేట్ వసతి, అవసరమైన అన్ని శిక్షణ, సాహసయాత్రతో పాటు అన్ని భోజన సదుపాయాలు ఈ ప్యాకేజీలో ఉంటాయని పేర్కొంది.
గత ఆదివారం టైటాన్ సబ్ మెర్సిబుల్ టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహాసముద్ర లోతుల్లోకి వెళ్లింది. సముద్ర మట్టం నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల లోతులో టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. అయితే టైటాన్ నీటిలోకి వెళ్లిన 1.45 గంటల తర్వాత దానితో సంబంధాలు కట్ అయ్యాయి. కొన్ని రోజుల పాటు రెస్య్కూ ఆపరేషన్ జరిగిన తర్వాత టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోజన్’ అనే ప్రక్రియకు గురై పేలిపోయిందని యూఎస్ నేవీ ప్రకటించింది. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది. అత్యధిక పీడనానికి గురైన సందర్భంలో ఇంప్లోజన్ చోటు చేసుకుంటుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే టైటాన్ పేలిపోయినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..