Titan: ఐదుగురు ప్రాణాల్ని తీసుకుంది.. అంతలోనే మళ్లీ టైటానిక్ వద్దకు తీసుకెళ్తుందట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్గేట్ ఎక్స్పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.
Read Also: India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
ఇదిలా ఉంటే ప్రమాదం జరిగి కొన్ని రోజులే అయింది. ఇంకా ఈ ప్రమాదం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఓషన్ గేట్ సంస్థ టైటానిక్ శిథిలాల వద్దకు తీసుకెళ్తామనే ప్రకటన విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురు ఓషన్ గేట్ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓషన్ గేట్ సంస్థ తన వెబ్సైట్లో తర్వాతి టైటానికి ట్రిప్ కు సంబంధించిన ప్రకటనను కొనసాగిస్తోంది. కంపెనీ 2024 జూన్ 12-20 మరియు జూన్ 21-29 వరకు రెండు విహారయాత్రలను ప్లాన్ చేస్తోంది. వెబ్సైట్ ప్రకారం, 8 డేస్-7 నైట్స్ ప్రయాణానికి ఒక్కొక్కరికి 250,000 డాలర్లు ఖర్చవుతుందని ప్రకటించింది. ఒక సబ్మెర్సిబుల్ డైవ్, ప్రైవేట్ వసతి, అవసరమైన అన్ని శిక్షణ, సాహసయాత్రతో పాటు అన్ని భోజన సదుపాయాలు ఈ ప్యాకేజీలో ఉంటాయని పేర్కొంది.
గత ఆదివారం టైటాన్ సబ్ మెర్సిబుల్ టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహాసముద్ర లోతుల్లోకి వెళ్లింది. సముద్ర మట్టం నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల లోతులో టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. అయితే టైటాన్ నీటిలోకి వెళ్లిన 1.45 గంటల తర్వాత దానితో సంబంధాలు కట్ అయ్యాయి. కొన్ని రోజుల పాటు రెస్య్కూ ఆపరేషన్ జరిగిన తర్వాత టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోజన్’ అనే ప్రక్రియకు గురై పేలిపోయిందని యూఎస్ నేవీ ప్రకటించింది. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు వెల్లడించింది. అత్యధిక పీడనానికి గురైన సందర్భంలో ఇంప్లోజన్ చోటు చేసుకుంటుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే టైటాన్ పేలిపోయినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!