Bangladesh Crisis : ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో ఆగని హింస.. 232 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు. జూలై మధ్యలో ప్రారంభమైన రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. బంగ్లాదేశ్లోని ప్రోథోమ్ అలో వార్తాపత్రిక ప్రకారం.. బుధవారం ఒక్కరోజే హింసలో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు.
బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు జూన్ నెల నుండి ఆందోళన చేస్తున్నారు. అనేక వారాల పాటు కొనసాగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రభుత్వ పతనం తరువాత, నిరసనలు హింసాత్మకంగా మారాయి, ఇందులో 232 మంది మరణించారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
Read Also:Bangladesh: 26ఏళ్ల ఇద్దరు విద్యార్థి నాయకులు..షేక్ హసీనా ప్రభుత్వాన్ని మట్టికరిపించారు
23 రోజుల్లో 560 మంది మృతి
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన నిరసనల్లో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 16 – ఆగస్టు 4 మధ్య రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణలలో 328 మంది మరణించారు. ఈ రెండు పరిణామాల మధ్య గత 23 రోజుల్లో మొత్తం 560 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది మంగళవారం మరణించారు.
209 మంది ఖైదీలు జైలు నుంచి పరార్
మంగళవారం ఘాజీపూర్లోని కాశీపూర్ హై సెక్యూరిటీ జైలు నుంచి దాదాపు 209 మంది ఖైదీలు పరారయ్యారు. ఖైదీలు పారిపోకుండా జైలు భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
Read Also:KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
విధులకు వెళ్లకుండా తప్పించుకుంటున్న పోలీసులు
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినప్పటి నుండి భద్రతా సిబ్బందిపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో భయపడి పోలీసులు విధులకు దూరంగా ఉంటున్నారు. గత మూడు రోజులుగా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు. రాజధాని రోడ్లపై విద్యార్థులు, ఇతర స్వచ్ఛంద సంస్థల కార్మికులు ట్రాఫిక్ పోలీసులుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం కొత్తగా నియమితులైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మైనుల్ ఇస్లాం 24 గంటల్లోగా తమ తమ కార్యాలయాలకు తిరిగి రావాలని పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!