Bangladesh Crisis : ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో ఆగని హింస.. 232 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు. జూలై మధ్యలో ప్రారంభమైన రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. బంగ్లాదేశ్లోని ప్రోథోమ్ అలో వార్తాపత్రిక ప్రకారం.. బుధవారం ఒక్కరోజే హింసలో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు.
బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు జూన్ నెల నుండి ఆందోళన చేస్తున్నారు. అనేక వారాల పాటు కొనసాగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రభుత్వ పతనం తరువాత, నిరసనలు హింసాత్మకంగా మారాయి, ఇందులో 232 మంది మరణించారు.
Also Read
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
Read Also:Bangladesh: 26ఏళ్ల ఇద్దరు విద్యార్థి నాయకులు..షేక్ హసీనా ప్రభుత్వాన్ని మట్టికరిపించారు
23 రోజుల్లో 560 మంది మృతి
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన నిరసనల్లో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 16 – ఆగస్టు 4 మధ్య రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణలలో 328 మంది మరణించారు. ఈ రెండు పరిణామాల మధ్య గత 23 రోజుల్లో మొత్తం 560 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది మంగళవారం మరణించారు.
209 మంది ఖైదీలు జైలు నుంచి పరార్
మంగళవారం ఘాజీపూర్లోని కాశీపూర్ హై సెక్యూరిటీ జైలు నుంచి దాదాపు 209 మంది ఖైదీలు పరారయ్యారు. ఖైదీలు పారిపోకుండా జైలు భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
Read Also:KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
విధులకు వెళ్లకుండా తప్పించుకుంటున్న పోలీసులు
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినప్పటి నుండి భద్రతా సిబ్బందిపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో భయపడి పోలీసులు విధులకు దూరంగా ఉంటున్నారు. గత మూడు రోజులుగా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు. రాజధాని రోడ్లపై విద్యార్థులు, ఇతర స్వచ్ఛంద సంస్థల కార్మికులు ట్రాఫిక్ పోలీసులుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం కొత్తగా నియమితులైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మైనుల్ ఇస్లాం 24 గంటల్లోగా తమ తమ కార్యాలయాలకు తిరిగి రావాలని పోలీసులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!