Vizag High Alert: విశాఖలో హై అలర్ట్… హింసకు పాల్పడితే కఠినచర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత హింసకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం అయ్యారు. రైల్వే ఉన్నత అధికారులతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
పూర్తి పోలీస్ బందో బస్తుతో విశాఖ రైల్వే స్టేషన్ కొనసాగుతోంది. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత కి విజ్ఞప్తి చేస్తున్నాం. హింసాత్మిక కార్యక్రమాలు ద్వారా దేన్ని సాధించలేం. ఆర్మీ కి వెళ్లాలని అనుకునే వాళ్లు, దేశానికీ సేవ చేయాలనుకునే వాళ్లు క్రమశిక్షణ తో ఉండాలి తప్ప ఇలా ప్రవర్తించకూడదని హితవు పలికారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో హింసాత్మక పోస్టులు పెట్టే కొంతమందిని గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైల్వే స్టేషన్ పరిధిలో పూర్తి బందోబస్తూ నిర్వహిస్తున్నాం. అక్కడ ఉన్న కొన్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళతో మాట్లాడాము. విద్యార్థుల కదలికలపై నిఘా ఉంచమని చెప్పామన్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో భద్రతపై ఆర్పిఎఫ్, జీఆర్పీ, పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు సీపీ శ్రీకాంత్. విశాఖ, గుంటూరు రైల్వే స్టేషన్ల పై సంఘ విద్రోహ శక్తులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఉందన్నారు. రైల్వే ఆస్తులు, కేంద్ర ప్రభుత్వం ఆస్తులకు ప్రత్యేక భద్రతకు కల్పిస్తున్నాం. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు వద్ద ప్రత్యేక నిఘాగా పెట్టాం. వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తున్నారు, వారిని గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్మీ రిక్రూటింగ్ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వాళ్ళతో ఇప్పటికే సంప్రదించామన్నారు.
సంఘవిద్రోహ శక్తుల మాయలోపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి కేసులు నమోదయితే యూనిఫాం వేసుకునే అవకాశం ఉండదనే ఈ విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవు. దేశానికి సేవ చేయాలి అనుకునే వాళ్లు క్రమశిక్షణతో ఉండాలి.. దేశ ఆస్తులను కాపాడుకోవాలి.
రైల్వే స్టేషన్లో పూర్తి భద్రత చర్యలు చేపట్టామన్నారు రైల్వే ఎస్పీ అరవింద్ నాథ్. లోకల్ పోలీసులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ల్లో కొన్నిటిని మూసి వేస్తున్నామన్నారు అరవింద్.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!