Venkaiah Naidu: ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులు
- ఒకే దేశం - ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు
- ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అర్ధవంతమైన చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ న్యాయమూర్తి బి.శివశంకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు.. రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అర్ధవంతమైన చర్చ జరగాలి.. వ్యతిరేకించే వారు వ్యతిరేకించినా.. ప్రజలు అంటే దేశం ఒక నిర్ణయానికి రావాలి.. పార్లమెంటు ఉభయసభలకు, అసెంబ్లీల సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి.
Also Read:Food Colors: ఏ రంగు ఆహారం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.. ఆ తరువాత 1967 వరకూ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి.. అప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు కాదంటున్నారో వారే చెప్పాలి.. ఈ ఏకకాలం ఎన్నికలు కొత్త ఏమీ కాదు.. ఈ ఎన్నికలు ఒకేసారి జరిగితే కేంద్రానికి లాభం ఉంటుంది అనే దానిలో పస ఎంతుందో వాళ్ళే చెప్పాలి.. స్ధానిక పరిపాలన, జాతీయ పరిపాలన ఎవరు చేయగలరో అందరూ గమనిస్తున్నారు.. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీలకు ఉపయోగం లేదనే వాదనలో పస లేదు.. ఒకేసారి ఎన్నికలు జరిగినపుడు అత్యధిక ఓటు శాతం నమోదైంది.. ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులొచ్చాయి.
Also Read:US: అమెరికాలో చదువుతున్న వారికి షాక్.. దేశం వదిలి వెళ్లాలంటూ ఈమెయిల్స్.. కారణం ఏమిటి..?
982 లో ఎన్టీఅర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. రామారావు లాంటి గట్టి నాయకుడు ఉండటంతో 1982లో టిడిపి గెలిచింది.. ఒక రాష్ట్రం అడ్డు అదుపు లేకుండా అప్పు తెస్తే తరువాత ప్రభుత్వాలు ఏమైపోవాలి.. అధికారంలోకి రాకముందు, వాగ్దానాల సమయంలో తెలీదు.. అధికారంలోకి వచ్చాక మొదటి తారీఖు జీతాలు ఇవ్వడానికి కుదరదు.. ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు ఉండాలి.. చదువు, వైద్యం మాత్రమే ఉచితం కావాలి.. అనవసరపు ఉచితాలు ఇస్తూ పోతే విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వలేం చేపను పట్టుకోవడ నేర్పించు.. తెచ్చి నోట్లో పెట్టొద్దు అని వెంకయ్యనాయుడు సూచించారు.
Also Read:BCCI: సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై ఫోకస్.. సమావేశం వాయిదా
మాజీ న్యాయమూర్తి శివశంకరరావు మాట్లాడుతూ.. ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తే పెద్ద ఇబ్బంది లేదు.. పదే పదే మధ్యలో ఎన్నికలు వస్తే.. ఎన్నికల కోడ్ ద్వారా చాలా పనులు ఆగిపోతాయి.. చాలామంది సెక్యులర్ భావాలంటూ సమాంతర ఎన్నికలు వద్దంటారు.. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమే.. సమాంతర ఎన్నికల వలన ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు.. అడపా దడపా ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ పేరిట ఇబ్బందులు వస్తాయి.. సమాంతర ఎన్నికలను అందరూ స్వాగతించాలని అన్నారు.
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!