BCCI: సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై ఫోకస్.. సమావేశం వాయిదా
- ఈరోజు బీసీసీఐ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
- గౌహతిలో జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలతో వాయిదా
- ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారుల మధ్య గౌహతిలో ఈ రోజు జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొంటారని భావించారు. IANS నివేదిక ప్రకారం.. సమావేశం వాయిదా విషయాన్ని శుక్రవారం రాత్రే సంబంధిత పార్టీలకు తెలియజేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం.. అజిత్ అగార్కర్ శనివారం గౌహతికి చేరుకుని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియాతో చర్చించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
Read Also: Abhinaya : పెళ్లి పీటలెక్కుతున్న నటి అభినయ.. వరుడు ఎవరో తెలుసా..?
Also Read
- 8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
- కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
ప్రస్తుతం ఈ సమావేశం కొత్త తేదీపై స్పష్టత లేదు. గౌహతిలో రెండవ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశముందని సమాచారం. బీసీసీఐ వర్గాల ప్రకారం.. భవిష్యత్తులో జరిగే ఈ సమావేశం వివరాలను త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. ఈ చర్చలో ప్రధానంగా చర్చించే అంశాలలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో.. భారత A జట్టుకు సంబంధించిన ఒప్పందాలు, సీనియర్ జట్టు ఎంపిక & ఇంగ్లాండ్ పర్యటన ప్రణాళిక అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Annamayya District: అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
మరోవైపు.. ఈ సమావేశానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో విదేశాల్లో సెలవులు గడుపుతున్నాడు. అయితే.. రాబోయే క్రికెట్ సీజన్ కోసం అతను మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాడు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ గురించి చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆటగాళ్లు A+ గ్రేడ్లో ఉన్నారు. అయితే.. టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత వీరి గ్రేడ్లో మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఎంఎస్ ధోని A+ గ్రేడ్లో కొనసాగిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!