BCCI: సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై ఫోకస్.. సమావేశం వాయిదా
- ఈరోజు బీసీసీఐ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
- గౌహతిలో జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలతో వాయిదా
- ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారుల మధ్య గౌహతిలో ఈ రోజు జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పాల్గొంటారని భావించారు. IANS నివేదిక ప్రకారం.. సమావేశం వాయిదా విషయాన్ని శుక్రవారం రాత్రే సంబంధిత పార్టీలకు తెలియజేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం.. అజిత్ అగార్కర్ శనివారం గౌహతికి చేరుకుని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియాతో చర్చించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
Read Also: Abhinaya : పెళ్లి పీటలెక్కుతున్న నటి అభినయ.. వరుడు ఎవరో తెలుసా..?
Also Read
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- CM Chandrababu: సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ప్రస్తుతం ఈ సమావేశం కొత్త తేదీపై స్పష్టత లేదు. గౌహతిలో రెండవ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశముందని సమాచారం. బీసీసీఐ వర్గాల ప్రకారం.. భవిష్యత్తులో జరిగే ఈ సమావేశం వివరాలను త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. ఈ చర్చలో ప్రధానంగా చర్చించే అంశాలలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో.. భారత A జట్టుకు సంబంధించిన ఒప్పందాలు, సీనియర్ జట్టు ఎంపిక & ఇంగ్లాండ్ పర్యటన ప్రణాళిక అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Annamayya District: అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
మరోవైపు.. ఈ సమావేశానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో విదేశాల్లో సెలవులు గడుపుతున్నాడు. అయితే.. రాబోయే క్రికెట్ సీజన్ కోసం అతను మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాడు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ గురించి చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆటగాళ్లు A+ గ్రేడ్లో ఉన్నారు. అయితే.. టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత వీరి గ్రేడ్లో మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఎంఎస్ ధోని A+ గ్రేడ్లో కొనసాగిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?