Vandemataram: వందేమాతరం, జనగణమనకు సమానహోదా.. ఢిల్లీ కోర్టులో కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vandemataram: జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’కు ఒకే హోదా ఉందని కేంద్ర సర్కారు వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పౌరులు రెండింటికీ సమాన గౌరవం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో కేంద్రం తెలిపింది. ‘వందేమాతరం’ పాటకు జాతీయ గీతం వలె గౌరవం, సమాన హోదా కల్పించాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్పై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అఫిడవిట్ను సమర్పించింది.
జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ వాటి సొంత పవిత్రతను కలిగి ఉన్నాయని, సమాన గౌరవానికి అర్హమైనవని కేంద్రం నొక్కిచెప్పింది. ప్రస్తుత ప్రొసీడింగ్ల అంశం ఎప్పటికీ రిట్ పిటిషన్కు సంబంధించిన అంశం కాదని పేర్కొంది. జనగణమన, వందేమాతరం రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయి. దేశంలోని ప్రతి పౌరుడు రెండింటికీ సమాన గౌరవం చూపాలి. భారతదేశ ప్రజల భావోద్వేగాలు, మనస్తత్వంలో జాతీయ గీతం ఒక ప్రత్యేకమైన, ప్రత్యేక స్థానాన్ని మాత్రమే ఆక్రమించిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మనీష్ మోహన్ ద్వారా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.’వందేమాతరం’ను ప్రచారం చేసే అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు విచారించిందని, రాజ్యాంగంలో జాతీయగేయానికి సంబంధించిన ప్రస్తావన లేనందున చర్చకు దిగడానికి నిరాకరించిందని కేంద్రం ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది.
Also Read
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
Ravichandran Ashwin: భారత్పై ఆ వ్యాఖ్యలు సరైనవి కావు.. రికీ పాంటింగ్కి కౌంటర్
‘జనగణమన’, ‘వందేమాతరం’కు సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ప్రజలంతా ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని వెల్లడించింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం చారిత్రాత్మకమైన పాత్ర పోషించిందని, 1950లో రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని ‘జనగణమన’గా గౌరవించాలని పిటిషనర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!