Ravichandran Ashwin: భారత్పై ఆ వ్యాఖ్యలు సరైనవి కావు.. రికీ పాంటింగ్కి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Counter To Ricky Ponting: ప్రస్తుత టీ20 వరల్డ్కప్ మెగాటోర్నీలో విరాట్ కోహ్లీ ఎంత అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరికీ తెలుసు! ఒక్క సౌతాఫ్రికా మ్యాచ్ మినహాయిస్తే.. మిగతా మ్యాచెస్లో అర్థశతకాలతో చెలరేగాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపిస్తూ.. టీమిండియాని తక్కువ చేసి మాట్లాడాడు. ఇప్పటివరకు భారత జట్టు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదని, కేవలం కోహ్లీ ఒక్కడే ఇరగదీశాడని పేర్కొన్నాడు. టీమిండియా విజయాలు సాధించాలంటే.. కోహ్లీ తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి నెలకొందని పాంటింగ్ వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ పరోక్షంగా స్పందిస్తూ.. రికీ పాంటింగ్కి కౌంటర్ వేశాడు. ‘‘ఇప్పుడు ఆడుతున్న టీ20 వరల్డ్కప్ టోర్నీలో కొన్ని మ్యాచుల్లో చివరివరకు పోరాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్లతో జరిగిన మ్యాచ్లు చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఇప్పటికీ మేము ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు, ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో ఎవ్వరూ పసిగట్టలేరు. చిన్న మార్జిన్తోనే మ్యాచ్ ఫలితం మారిపోతుంటుంది. గతంలో ఎంతోమంది నిపుణులు, మాజీలు సైతం అలాంటి అభిప్రాయాల్ని వెల్లడించారు. అయితే.. మా జట్టు ప్రదర్శన సరిగ్గా లేదని వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైనది కాదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి, ఆటతీరుని కొనసాగించాల్సి ఉంటుంది’’ అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
ఇదిలావుండగా.. రెండో గ్రూప్లో భారత జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ సెమీస్లో బెర్త్ కన్ఫమ్ చేసుకోవాలంటే.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ని తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే.. సెమీస్ అవకాశాలు కష్టాల్లో పడతాయి. ఎందుకంటే.. భారత్తో పోలిస్తే, పాకిస్తాన్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయి, బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ మంచి స్కోరుతో గెలిస్తే.. రన్ రేట్ ఆధారంగా భారత్ని పాక్ వెనక్కి నెడుతుంది. అప్పుడు సెమీస్ నుంచి భారత్ నిష్క్రమించినట్టే! అటు, సౌతాఫ్రికా పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నా, నెదర్లాండ్స్ జట్టు చిన్నదే కాబట్టి, దానిపై అది పైచేయి సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!