V. Hanumantha Rao : బీజేపీ దళితులను అనగదొక్కాలని చూస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ పేదలకు దానం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కుంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సమస్యలను తెలుసుకున్నాడని అన్నారు. బీజేపీ పార్టీ దళితులను అనగదొక్కాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులల వారీగా రిజర్వేషన్లు చేస్తామని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు దేశవ్యాప్తంగా 85 శాతం మంది ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కల్పించిన తర్వాత మాత్రమే రాజకీయ చైతన్యం మొదలైందని ఆయన వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 54 శాతం బీసీలుంటే వారిని సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకే పరి మితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను బీజేపీ దేవుడంటోందని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో ప్రజలంతా మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. కేంద్రానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో.. మాట్లాడుతారో వాళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, బీసీలందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించాలన్నారు.
Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు అనే శని పవన్ నెత్తిమీద ఉంది.. అందుకే అలా..!
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?