V. Hanumantha Rao : బీజేపీ దళితులను అనగదొక్కాలని చూస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ పేదలకు దానం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కుంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సమస్యలను తెలుసుకున్నాడని అన్నారు. బీజేపీ పార్టీ దళితులను అనగదొక్కాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులల వారీగా రిజర్వేషన్లు చేస్తామని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు దేశవ్యాప్తంగా 85 శాతం మంది ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కల్పించిన తర్వాత మాత్రమే రాజకీయ చైతన్యం మొదలైందని ఆయన వెల్లడించారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 54 శాతం బీసీలుంటే వారిని సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకే పరి మితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను బీజేపీ దేవుడంటోందని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో ప్రజలంతా మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. కేంద్రానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో.. మాట్లాడుతారో వాళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, బీసీలందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరించాలన్నారు.
Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు అనే శని పవన్ నెత్తిమీద ఉంది.. అందుకే అలా..!
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!