Uttam Kumar Reddy : ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశాం
- ఈ నెల 20 ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
- ఈ నేపథ్యంలో NDSA చైర్మన్
- అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించిన మంత్రి ఉత్తమ్
- వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు NDSA చైర్మన్, అధికారులతో మాట్లాడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలో NDSA కమిటీతో సమావేశం ఉంటుందని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్ కి పోతున్నవని, ఇరిగేషన్ పనుల కోసం మరో 11 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాలని ఆర్ధిక శాఖని కోరుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2025 డిసెంబర్ వరకు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, డిండి కూడా ప్లాన్ లో ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Prank Goes Wrong: ప్రాంక్ ప్రాణాలు తీసింది.. మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్..
Also Read
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బడ్జెట్ కోసం పైనాన్స్ డిపార్ట్మెంట్ కి పంపుతున్నామని, సమ్మక్క ప్రాజెక్ట్ ల్యాండ్ కోసం ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యారేజీకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. భారీవర్షాలు పడితే ప్రాజెక్ట్లకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Amitabh Bachchan: ప్రభాస్ కి అది కొత్త ఏంకాదు అంటున్న బిగ్ బి
తాజావార్తలు
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?