పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Thopudurthi Prakash Reddy: అజ్ఞాతంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే.. జాడ కోసం పోలీసుల వేట
ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తుందని, పహల్గామ్ దాడి దర్యాప్తులో సహకరించాలని పాకిస్తాన్ను కోరిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్లో, దక్షిణాసియాలో ఇటీవలి పరిణామాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయడం అనే అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది.
Also Read:Thopudurthi Prakash Reddy: అజ్ఞాతంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే.. జాడ కోసం పోలీసుల వేట
ఇది 24 కోట్ల మందికి జీవనాధారమని.. దానిలో ఏకపక్షంగా ఉపసంహరించుకునే నిబంధన లేదని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ తో కలిసి పనిచేయాలని రూబియో పాకిస్తాన్ ప్రధానిని కోరారు. ప్రధాన మంత్రి షరీఫ్తో ఫోన్లో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండించాలని.. దర్యాప్తుకు సహకరించాలని రూబియో పాకిస్తాన్ను కోరారు.