Giri Raja Singh: మణి శంకర్ వ్యాఖ్యల పై కేంద్ర మంత్రి గిరిరాజ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగుదేశం పాకిస్థాన్ తో అణుబాంబులు ఉన్నందున భారత్ ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్పై అణుదాడి గురించి ఆలోచించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు సంబంధించి అయ్యర్ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది. దానికి స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ మ్యాప్ లో కూడా సరిగ్గా కనిపించదు.’ అని వ్యాఖ్యానించారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు టెర్రరిస్టుల భాష మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
READ MORE:Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ఇంటర్వ్యూ కి వచ్చిన యువతిపై..
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అయ్యర్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్కు భయం ఎక్కువన్నారు. కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో నివసిస్తున్నా.. వారి హృదయాలు పాకిస్థాన్లో ఉన్నాయని విమర్శించారు. పాకిస్థాన్ను ఎలా సమాధానం చెప్పాలో భారత్ కు తెలుసని చెప్పారు. అదే సమయంలో మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సిద్ధాంతం ఈ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్, ఉగ్రవాదానికి మద్దతిస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. పాకిస్థాన్ గౌరవం గురించి మాట్లాడుతున్న మణిశంకర్.. పాకిస్థాన్లో అణుబాంబులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. భారతదేశం భయపడాలా అని ప్రశ్నించారు. ప్రకటనను నేను తీవ్రంగా ఖండించారు. ఒక నిర్దిష్ట తరగతి ఓట్ల కోసం ఇది జరుగుతోందని తెలిపారు. బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా స్పందించారు. “అయ్యర్ స్వయంగా చికిత్స చేయించుకోవాలి. ఇది మోడీ భారతదేశం. ఇది కాంగ్రెస్ కాలం నాటి భారతదేశం కాదు. మోడీ ఫోటో చూసిన వెంటనే పాకిస్థాన్ ప్రజలకు మూర్ఛ వస్తుంది.” అదే సమయంలో.. మణిశంకర్ ప్రకటన వ్యక్తిగతమని ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ అన్నారు.
- Tags
- anurag thakuer
- ayyar
- bjp
- congress
- fire
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!