Kakarla Suresh: పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి విశేష స్పందన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డి పాలెం గ్రామాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక, వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో వాల్మీకి వంశస్థుల ఆత్మీయ సమావేశంలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీ రచించిన రామాయణం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతటి ఘన కీర్తి కలిగిన వాల్మీకి వంశస్థులు ఉదయగిరి చరిత్రను తిరగరాయాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి గ్రామంలోని 50 గడపలకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెకి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.
Read Also: Vladimir Putin : వణుకు పుట్టిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
Also Read
అలాగే, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం ముస్తాపురం గ్రామంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడిపి ఎన్నికల మ్యానిఫెస్టో కర పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ.. మా బావ కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నా.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరోవైపు, కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టీ నా భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడిపి జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Also: Actor Bramhaji :ఛీ ఛీ… బూతు పురాణాలు.. వాంతులయ్యేలా ఉన్నాయి..
ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ కి మద్దతుగా డ్యాన్స్ మాస్టర్, జనసేన ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ మాట్లాడుతూ.. సంపద సృష్టించే మొనగాడు చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే, రాజధాని నిర్మాణం జరగాలన్న, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్న, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ అభివృద్ధి పరిగెత్తాలన్నా, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ 4000 అవుతుందన్నారు.. అలాగే, సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని జానీ మాస్టర్ తెలిపారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజా సేవకులైన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!