Rajasthan: ప్రమాదంలో 70 లక్షల మంది యువత భవిష్యత్తు.. గెహ్లాట్ సర్కారుపై కేంద్ర మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. రాజస్థాన్లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వివరణ ఇచ్చారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ మాటల దాడి చేశారు. ” ముఖ్యంగా రాజస్థాన్లో 19 పేపర్ లీక్ల శ్రేణికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ లీక్లు దాదాపు 70 లక్షల మంది యువకుల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి.” అని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Also Read: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
ఆర్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ జరిపిన దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. పరీక్షకు హాజరవుతున్న వారు గిరిజన లేదా దళిత కుటుంబాలకు చెందిన కుమారులు లేదా కుమార్తెలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో సుస్థిరత నెలకొంటుందని, కుటుంబం నిలబడుతుందనే ఆశతో కొడుకు, కూతురిని చదివించేందుకు కుటుంబ సభ్యులు తమ జీవితాలను త్యాగం చేశారని.. యువత కూడా రాత్రంతా మేల్కొని పరీక్షకు సిద్ధమయ్యారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే చివరికి పేపర్ లీక్ రూపంలో ఫలితం వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మొదటి పేపర్ లీక్ నుంచి 19వ పేపర్ లీక్ అయ్యే వరకు ప్రభుత్వం, ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు దాన్ని కప్పిపుచ్చుతూనే కనిపించారని గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడు, సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు సాధారణమని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అన్నారని తెలిపారు. తర్వాత మాట మార్చి విచారణ జరిపిస్తామని చెప్పారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Also Read: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ..”పేపర్ లీక్ వ్యవహారం ఆగకపోగా.. అందులో ఏ అధికారి, ఉద్యోగి ప్రమేయం లేదని సీఎం అన్నారు. వరుసగా 18 పేపర్ లీక్ ఘటనల వరకు అధికారులు, ఉద్యోగులకు క్లీన్ చిట్ ఇస్తూనే ఉంది. దీని తర్వాత, రాజస్థాన్లోని ప్రతి జిల్లాలో బీజేపీ ఆందోళన ప్రారంభించింది. వారిపై ఒత్తిడి వచ్చింది. జర్నలిస్టులు కూడా ఎంతో ధైర్యంగా పేపర్ లీక్ నిజాన్ని దేశం ముందు ప్రదర్శించారు. ఆ తర్వాత వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్పీఎస్సీ సభ్యుడిని జైలుకు పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదా పొందిన వ్యక్తిని కూడా రెడ్ హ్యాండెడ్గా జైలుకు పంపారు. ఈ పేపర్ లీక్ కేసులో ఈడీ ప్రవేశించడం దాని కింగ్పిన్ను అరెస్టు చేయడానికి దారితీసింది. దీని తర్వాత, ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఈడీ చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వం నేడు వెనుకడుగు వేసి భయాందోళనకు గురవుతోంది. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని నరేంద్ర మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. పేపర్ లీక్ కేసులో సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ఎస్వోజీ, యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేస్తున్నాయి. సీఎం, హోంమంత్రి కావడంతో ప్రత్యక్ష నియంత్రణ సీఎందే. ఆ తర్వాత కూడా ఎలాంటి విచారణ నిష్పక్షపాతంగా జరగలేదు.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!