Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Dayal: భారత యువ పేసర్ యశ్ దయాల్ దాదాపు ఏడాది కాలం పాటు క్రికెట్కు దూరమైన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UPT20 League) కొత్త సీజన్ ద్వారా అతను మళ్లీ బంతిని చేతపట్టనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున చివరిగా మ్యాచ్ ఆడిన ఈ 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత కొన్ని తీవ్రమైన చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుని ఆటకు దూరమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పాటు, మరో కేసులో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అతనిపై ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కేసులన్నింటి నుంచి అతను విముక్తి పొందినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) కార్యదర్శి ప్రేమ్ మనోహర్ గుప్తా స్పందిస్తూ.. యశ్ దయాల్పై ఉన్న చట్టపరమైన వివాదాలన్నీ పరిష్కారమైనందున, అతను దేశవాళీ క్రికెట్, లీగ్ మ్యాచ్లు ఆడుకోవడానికి బోర్డు తరఫున ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, యూపీ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. యశ్ దయాల్ను అతని పాత ఫ్రాంచైజీ ‘గోరఖ్పూర్ లయన్స్’ తమ జట్టులోనే నిలబెట్టుకుందని (Retained), రాబోయే లీగ్లో అతను బరిలోకి దిగడం ఖాయమని ధృవీకరించారు. అలాగే జూలై మధ్యలో ఆగ్రా లేదా నోయిడా నగరాల్లో లీగ్ మినీ వేలాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ అక్కడ హోటల్ వసతులు కుదరకపోతే లక్నోలోనే నిర్వహిస్తామని కపూర్ పేర్కొన్నారు.
Also Read
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
గతంలో యశ్ దయాల్పై నమోదైన కేసుల వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి నెపంతో ఒక మహిళను లైంగికంగా లొంగదీసుకున్నాడనేది ఆ ఆరోపణ. ఇక రెండవ కేసు జైపూర్లోని సాంగనేర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. క్రికెట్ కెరీర్ ఆశ చూపిస్తూ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. సీతాపురలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో సదరు అమ్మాయి వయసు 17 ఏళ్లు కావడంతో పోలీసులు దీనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ చట్టపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో, యశ్ దయాల్ సరికొత్త ఆశలతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు.
తాజావార్తలు
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!