Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Dayal: భారత యువ పేసర్ యశ్ దయాల్ దాదాపు ఏడాది కాలం పాటు క్రికెట్కు దూరమైన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UPT20 League) కొత్త సీజన్ ద్వారా అతను మళ్లీ బంతిని చేతపట్టనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున చివరిగా మ్యాచ్ ఆడిన ఈ 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత కొన్ని తీవ్రమైన చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుని ఆటకు దూరమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పాటు, మరో కేసులో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అతనిపై ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కేసులన్నింటి నుంచి అతను విముక్తి పొందినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) కార్యదర్శి ప్రేమ్ మనోహర్ గుప్తా స్పందిస్తూ.. యశ్ దయాల్పై ఉన్న చట్టపరమైన వివాదాలన్నీ పరిష్కారమైనందున, అతను దేశవాళీ క్రికెట్, లీగ్ మ్యాచ్లు ఆడుకోవడానికి బోర్డు తరఫున ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, యూపీ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. యశ్ దయాల్ను అతని పాత ఫ్రాంచైజీ ‘గోరఖ్పూర్ లయన్స్’ తమ జట్టులోనే నిలబెట్టుకుందని (Retained), రాబోయే లీగ్లో అతను బరిలోకి దిగడం ఖాయమని ధృవీకరించారు. అలాగే జూలై మధ్యలో ఆగ్రా లేదా నోయిడా నగరాల్లో లీగ్ మినీ వేలాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ అక్కడ హోటల్ వసతులు కుదరకపోతే లక్నోలోనే నిర్వహిస్తామని కపూర్ పేర్కొన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
గతంలో యశ్ దయాల్పై నమోదైన కేసుల వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి నెపంతో ఒక మహిళను లైంగికంగా లొంగదీసుకున్నాడనేది ఆ ఆరోపణ. ఇక రెండవ కేసు జైపూర్లోని సాంగనేర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. క్రికెట్ కెరీర్ ఆశ చూపిస్తూ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. సీతాపురలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో సదరు అమ్మాయి వయసు 17 ఏళ్లు కావడంతో పోలీసులు దీనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ చట్టపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో, యశ్ దయాల్ సరికొత్త ఆశలతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?