Rajasthan: ప్రమాదంలో 70 లక్షల మంది యువత భవిష్యత్తు.. గెహ్లాట్ సర్కారుపై కేంద్ర మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. రాజస్థాన్లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వివరణ ఇచ్చారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ మాటల దాడి చేశారు. ” ముఖ్యంగా రాజస్థాన్లో 19 పేపర్ లీక్ల శ్రేణికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ లీక్లు దాదాపు 70 లక్షల మంది యువకుల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి.” అని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Also Read: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ఆర్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ జరిపిన దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. పరీక్షకు హాజరవుతున్న వారు గిరిజన లేదా దళిత కుటుంబాలకు చెందిన కుమారులు లేదా కుమార్తెలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో సుస్థిరత నెలకొంటుందని, కుటుంబం నిలబడుతుందనే ఆశతో కొడుకు, కూతురిని చదివించేందుకు కుటుంబ సభ్యులు తమ జీవితాలను త్యాగం చేశారని.. యువత కూడా రాత్రంతా మేల్కొని పరీక్షకు సిద్ధమయ్యారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే చివరికి పేపర్ లీక్ రూపంలో ఫలితం వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మొదటి పేపర్ లీక్ నుంచి 19వ పేపర్ లీక్ అయ్యే వరకు ప్రభుత్వం, ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు దాన్ని కప్పిపుచ్చుతూనే కనిపించారని గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడు, సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు సాధారణమని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అన్నారని తెలిపారు. తర్వాత మాట మార్చి విచారణ జరిపిస్తామని చెప్పారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Also Read: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ..”పేపర్ లీక్ వ్యవహారం ఆగకపోగా.. అందులో ఏ అధికారి, ఉద్యోగి ప్రమేయం లేదని సీఎం అన్నారు. వరుసగా 18 పేపర్ లీక్ ఘటనల వరకు అధికారులు, ఉద్యోగులకు క్లీన్ చిట్ ఇస్తూనే ఉంది. దీని తర్వాత, రాజస్థాన్లోని ప్రతి జిల్లాలో బీజేపీ ఆందోళన ప్రారంభించింది. వారిపై ఒత్తిడి వచ్చింది. జర్నలిస్టులు కూడా ఎంతో ధైర్యంగా పేపర్ లీక్ నిజాన్ని దేశం ముందు ప్రదర్శించారు. ఆ తర్వాత వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్పీఎస్సీ సభ్యుడిని జైలుకు పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదా పొందిన వ్యక్తిని కూడా రెడ్ హ్యాండెడ్గా జైలుకు పంపారు. ఈ పేపర్ లీక్ కేసులో ఈడీ ప్రవేశించడం దాని కింగ్పిన్ను అరెస్టు చేయడానికి దారితీసింది. దీని తర్వాత, ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఈడీ చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వం నేడు వెనుకడుగు వేసి భయాందోళనకు గురవుతోంది. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని నరేంద్ర మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. పేపర్ లీక్ కేసులో సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ఎస్వోజీ, యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేస్తున్నాయి. సీఎం, హోంమంత్రి కావడంతో ప్రత్యక్ష నియంత్రణ సీఎందే. ఆ తర్వాత కూడా ఎలాంటి విచారణ నిష్పక్షపాతంగా జరగలేదు.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!