Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Gajendra Singh Shekhawat Briefs On Ed Raids In Rajasthan

Rajasthan: ప్రమాదంలో 70 లక్షల మంది యువత భవిష్యత్తు.. గెహ్లాట్‌ సర్కారుపై కేంద్ర మంత్రి ఫైర్

Published Date :October 26, 2023 , 6:07 pm
By Mahesh Jakki
Rajasthan: ప్రమాదంలో 70 లక్షల మంది యువత భవిష్యత్తు.. గెహ్లాట్‌ సర్కారుపై కేంద్ర మంత్రి ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajasthan: రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వివరణ ఇచ్చారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ గజేంద్ర సింగ్ షెకావత్‌ మాటల దాడి చేశారు. ” ముఖ్యంగా రాజస్థాన్‌లో 19 పేపర్ లీక్‌ల శ్రేణికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ లీక్‌లు దాదాపు 70 లక్షల మంది యువకుల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి.” అని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

Also Read: Qatar: 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్..

ఆర్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ జరిపిన దాడులపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. పరీక్షకు హాజరవుతున్న వారు గిరిజన లేదా దళిత కుటుంబాలకు చెందిన కుమారులు లేదా కుమార్తెలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో సుస్థిరత నెలకొంటుందని, కుటుంబం నిలబడుతుందనే ఆశతో కొడుకు, కూతురిని చదివించేందుకు కుటుంబ సభ్యులు తమ జీవితాలను త్యాగం చేశారని.. యువత కూడా రాత్రంతా మేల్కొని పరీక్షకు సిద్ధమయ్యారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే చివరికి పేపర్ లీక్ రూపంలో ఫలితం వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మొదటి పేపర్ లీక్ నుంచి 19వ పేపర్ లీక్ అయ్యే వరకు ప్రభుత్వం, ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు దాన్ని కప్పిపుచ్చుతూనే కనిపించారని గజేంద్ర సింగ్ షెకావత్‌ ఆరోపించారు. మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడు, సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు సాధారణమని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అన్నారని తెలిపారు. తర్వాత మాట మార్చి విచారణ జరిపిస్తామని చెప్పారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Also Read: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ..”పేపర్ లీక్ వ్యవహారం ఆగకపోగా.. అందులో ఏ అధికారి, ఉద్యోగి ప్రమేయం లేదని సీఎం అన్నారు. వరుసగా 18 పేపర్ లీక్ ఘటనల వరకు అధికారులు, ఉద్యోగులకు క్లీన్ చిట్ ఇస్తూనే ఉంది. దీని తర్వాత, రాజస్థాన్‌లోని ప్రతి జిల్లాలో బీజేపీ ఆందోళన ప్రారంభించింది. వారిపై ఒత్తిడి వచ్చింది. జర్నలిస్టులు కూడా ఎంతో ధైర్యంగా పేపర్ లీక్ నిజాన్ని దేశం ముందు ప్రదర్శించారు. ఆ తర్వాత వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్పీఎస్సీ సభ్యుడిని జైలుకు పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి హోదా పొందిన వ్యక్తిని కూడా రెడ్ హ్యాండెడ్‌గా జైలుకు పంపారు. ఈ పేపర్ లీక్ కేసులో ఈడీ ప్రవేశించడం దాని కింగ్‌పిన్‌ను అరెస్టు చేయడానికి దారితీసింది. దీని తర్వాత, ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఈడీ చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వం నేడు వెనుకడుగు వేసి భయాందోళనకు గురవుతోంది. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని నరేంద్ర మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. పేపర్ లీక్ కేసులో సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ఎస్వోజీ, యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేస్తున్నాయి. సీఎం, హోంమంత్రి కావడంతో ప్రత్యక్ష నియంత్రణ సీఎందే. ఆ తర్వాత కూడా ఎలాంటి విచారణ నిష్పక్షపాతంగా జరగలేదు.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ED raids
  • Enforcement Directorate
  • Gajendra Singh Shekhawat
  • Rajasthan
  • telugu news

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions