Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Marsh: దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నమెంట్ SA20లో ప్రస్తుత ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కీలక నిర్ణయం తీసుకుంది. సన్ గ్రూప్ సహ యజమాని కావ్య మారన్ ఆధ్వర్యంలోని ఈ ఫ్రాంచైజీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను జట్టులోకి తీసుకుంది. దీంతో రాబోయే సీజన్లో జట్టు మరింత బలపడింది. మార్ష్కు SA20లో ఆడడం ఇదే తొలి అనుభవం కావడం విశేషం.
ఐపీఎల్ 2026లో అదిరిపోయిన ప్రదర్శన
మిచెల్ మార్ష్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్ల్లో 563 పరుగులు చేసి జట్టుకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. అతని దూకుడైన బ్యాటింగ్, ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ ప్రదర్శనే SA20లో అతనికి భారీ డిమాండ్ తీసుకొచ్చింది.
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
మరింత బలపడిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్
మిచెల్ మార్ష్ చేరికతో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ మిడిల్ ఆర్డర్కు మరింత బలం చేకూరింది. ఇప్పటికే ఈ జట్టులో క్వింటన్ డి కాక్, ట్రిస్టన్ స్టబ్స్, ఆన్రిచ్ నార్ట్జే, ఆడమ్ మిల్నే, మార్కో జాన్సెన్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు మార్ష్ రావడంతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు మరింత సమతూకంగా మారింది.
రిషాద్ హుస్సేన్కూ చోటు
మిచెల్ మార్ష్తో పాటు బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ను కూడా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టులోకి చేర్చుకుంది. 2024 టీ20 ప్రపంచకప్లో 14 వికెట్లు తీసి ఆకట్టుకున్న రిషాద్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ఏఎం ఘజన్ఫర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు.
మరో టైటిల్ లక్ష్యంగా సన్రైజర్స్
SA20 చరిత్రలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో మూడు టైటిళ్లను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పుడు మరోసారి ట్రోఫీపై కన్నేసింది.
జనవరి 17 నుంచి కొత్త సీజన్
SA20 తదుపరి సీజన్ జనవరి 17న ప్రారంభం కానుంది. సీజన్కు ముందు అక్టోబర్ 7న మినీ వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే జట్టు ప్రధాన ఆటగాళ్లను కొనసాగించిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్, ట్రిస్టన్ స్టబ్స్ను మరోసారి కెప్టెన్గా కొనసాగిస్తోంది. ప్రస్తుతం జట్టులో వేలం ద్వారా భర్తీ చేయాల్సిన స్థానాలు కేవలం రెండు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!