Lok Sabha Elections 2024: కసబ్ కేసు వాదించిన న్యాయవాదికి బీజేపీ ఎంపీ టికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ అభ్యర్ధిని ప్రకటించింది. ముంబై 26/11 ఉగ్రదాడిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ఎన్నికల బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో ఆయనను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. గత కొంతకాలంగా బీజేపీ అంతర్గతంగా చేయించిన సర్వేల్లో పూనమ్ మహాజన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. పూనం మహాజన్ను తొలగించే సూచనలు ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. కాగా, కాంగ్రెస్ పార్టీ ధారావి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ అభర్థి వర్షా గైక్వాడ్తో ఉజ్వల్ నికమ్ పోటీ పడబోతున్నారు. మే 20వ తేదీన జరగనున్న ఐదో విడత ఎన్నికలో ముంబైలో పోలింగ్ జరగబోతుంది.
Read Also: Chandrababu: ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేసింది నేనే
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, 1993 ముంబై బాంబు పేలుళ్లు, గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ బాగా కష్టపడ్డాడు. 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ రేప్, మర్డర్ కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్గా కూడా ఆయన పని చేశారు. నికమ్ విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా, ఉజ్వల్ నికమ్ తన న్యాయవాద వృత్తిలో 30 ఏళ్ల కెరీర్లో 628 జీవిత ఖైదు, 37 మందికి మరణశిక్ష విధించేలా చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!