Donald Trump: తొలిసారి మిత్ర దేశం ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
- ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరు దేశాలపై ట్రంప్ ఫైర్
- మిత్ర దేశం ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్
- తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు సూచన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అనంతరం పరస్పరం దాడులు చేసుకోవడంపై ఫైర్ అయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయన్నారు. ఈ క్రమంలో మిత్రదేశమైన
ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరించారు. “ఇజ్రాయెల్.. ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చారు.
READ MORE: Banakacherla: బనకచర్లపై కేబినెట్లో కీలక చర్చ.. మనం కౌంటర్ ఇవ్వాలి..!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
మిత్రదేశంగా భావించే ఇజ్రాయెల్పై ట్రంప్ తొలిసారిగా ఫైర్ అయ్యారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్.. “కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్నాయి. ఇరాన్తోపాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిచింది. ఇజ్రాయెల్ చర్యలను నేను వ్యతిరేకిస్తున్నాను. టెల్ అవీవ్ శాంతించాలని నేను కోరుకుంటున్నాను.” తెలిపారు. ఈ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ట్రంప్ మరో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదని.. అన్ని విమానాలు తిరిగి వెనక్కి వచ్చేస్తాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
READ MORE: CM Revanth Reddy: నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?