Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Are You Ready For A Debate On Banakachar In The Assembly Cm Revanth Challenges Kcr

CM Revanth Reddy: బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? కేసీఆర్‌కి సీఎం రేవంత్‌ సవాల్..

Published Date :June 24, 2025 , 6:55 pm
By RAMAKRISHNA KENCHE
  • బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..?
  • గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా?
  • చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లే వాడిని
  • సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన
  • రైతు భరోసా విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? కేసీఆర్‌కి సీఎం రేవంత్‌ సవాల్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు. చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లి ఉండే వాడిని కాదా? అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చిన.. నీ మాదిరి మోసం చేయలే అని విమర్శించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేయలేదని.. బనకచర్ల పై చర్చ కోసం కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని.. కేసీఆర్ హయాంలో ఏపీ ముచుమర్రి కట్టారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసింది కూడా మీ హయాంలోనే అన్నారు.

READ MORE: Perni Nani: చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై పేర్నా నాని తీవ్ర వ్యాఖ్యలు..

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిపై సీఏం రేవంత్ ప్రసంగించారు.  “పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో ప్రజలకు లెక్క చెప్పు.. దేని మీద నువ్వు చర్చకు వస్తావ్ కేసీఆర్ అని నేను అడుతున్న.. 1లక్ష 4 వేల కోట్ల రూపాయలతో రైతును రాజును చేసిన ప్రభుత్వం మాది. వ్యవసాయం అంటే రైతుకు సాయం చేయడం. కాళేశ్వరం పేరుతో కమిషన్లు తీసుకున్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పాము. ఆదిశగా మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించాము. ప్రజా పాలనలో అందరూ భద్రంగా ఉండాలని చూస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 18 ఏళ్ల మా పాలనపై ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. పదేళ్లలో ఏ ప్రాజెక్టులు చూసిన పూర్తి చేయాలే. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. లక్ష కోట్లు వృధా అయ్యాయి. చిన్న కాళేశ్వరం లో నిన్ను ఉరేసినా తప్పులేదని రైతులు అంటున్నారు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: CM Revanth Reddy: రాష్ట్రం క్యాన్సర్ పేషంట్‌లా ఉన్నప్పుడు మాకు అప్పగించారు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

“గోదావరి నీటి పై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చ చేద్దాం. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరో ఆధారాలు సహా చెబుతా. అప్పుడంటే పెద్దలు జానారెడ్డి నీతో ఎందుకులే అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. నువ్వు అసెంబ్లీకి రా.. నీ సంగతి చూస్తాం. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకు సూచిస్తున్నా. రాబోయే మరో ఐదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే. ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించండి.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 000 Jobs
  • 60
  • Assembly debate
  • Banakacharla
  • brs vs congress

తాజావార్తలు

  • BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

  • AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!

  • Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా

  • IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions