Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడే 'గ్రీన్ జోన్'లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద దాడి జరిగింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది.