Addanki Dayakar: రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉంది: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరిగింది
- దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారింది.
- జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు చేయడం కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యల వైపు అడుగులే అని వ్యాఖ్యానించారు.
Also Read: Robbery Case: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని, ఇది ఆ పార్టీ సామ్రాజ్యవాద దృక్పథానికి నిదర్శనమని దయాకర్ విమర్శించారు. బీజేపీ తన రాజకీయ మిత్రులతో సంబంధాలను కొనసాగిస్తూ, తన స్వలాభం కోసం మిత్రపక్షాలను ఎదురుదాడికి గురిచేయడం ఆ పార్టీ నైజమని స్పష్టమయ్యిందన్నారు. ఆపై ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుతో కయ్యం బీజేపీకి ప్రమాదకరమని తెలుసు కానీ, పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తన ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తన రాజకీయ మిత్రులను ఉపయోగించి, అదే పార్టీని అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యమని దయాకర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి భారత రాజ్యాంగ పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను దయాకర్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షకుడిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!