Addanki Dayakar: రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉంది: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరిగింది
- దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారింది.
- జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు చేయడం కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యల వైపు అడుగులే అని వ్యాఖ్యానించారు.
Also Read: Robbery Case: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని, ఇది ఆ పార్టీ సామ్రాజ్యవాద దృక్పథానికి నిదర్శనమని దయాకర్ విమర్శించారు. బీజేపీ తన రాజకీయ మిత్రులతో సంబంధాలను కొనసాగిస్తూ, తన స్వలాభం కోసం మిత్రపక్షాలను ఎదురుదాడికి గురిచేయడం ఆ పార్టీ నైజమని స్పష్టమయ్యిందన్నారు. ఆపై ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుతో కయ్యం బీజేపీకి ప్రమాదకరమని తెలుసు కానీ, పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తన ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తన రాజకీయ మిత్రులను ఉపయోగించి, అదే పార్టీని అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యమని దయాకర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి భారత రాజ్యాంగ పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను దయాకర్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షకుడిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!